
అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పరిధిలోనీ పలు గ్రామాలలో సారవంతమైన భూములు నివాస గృహాలు, పచ్చని కొబ్బరి చెట్లు నదీ గర్భంలో కలిసిపోవడం రైతులకు గుండె కోతను మిగిలిస్తుంది. అప్పనపల్లి, బి దొడ్డవరం, పెదపట్నం లంక, పాశర్లపూడి పలు గ్రామాలలో వేలాది ఎకరాల భూమి, లక్షలాది కొబ్బరి చెట్లు గత కొన్ని నీళ్లుగా తమ కళ్లెదుటే గోదారమ్మ వడిలో కలసి పోవడంపై ఈ ప్రాంతంలోని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 50 ఏళ్ల క్రితం నిర్మించిన గ్రోవెన్స్ పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. ప్రభుత్వాలు, నాయకులు మారుతున్నారు తప్ప అప్పటి నుంచి ఇప్పటివరకు వీటిని పట్టించుకునే వాళ్లు లేకుండా పోయారన్నది ఇక్కడి వాళ్ల వాదన. తుఫాన్లు, తీవ్ర తుఫాన్ల సమయంలో ఎకరాలకు ఎకరాల భూమి గోదావరి కోతకు గురవుతోంది. దీంతో ఈ భూములను నమ్ముకుని సాగు చేసుకుంటున్న రైతులు.. ఇక్కడ నివాసం ఉంటున్న స్థానికులు తీవ్రంగా నష్టపోతున్నారు.