
భారత్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ల వాడకం నిరంతరం పెరుగుతోంది. వాహనదారులు ఈవీల కొనుగోలుకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. టూవీలర్ తయారీ కంపెనీలు అదిరిపోయే ఫీచర్లతో ఈవీలను రూపొందించి మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. మీరు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే రాబోయే కొన్ని నెలల్లో ఓలా, ఏథర్, సుజుకి, యమహా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లోకి రిలీజ్ కానున్నాయి. బడ్జెట్ ధరల్లోనే లభించనున్నాయి. ఏయే కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎప్పుడు రిలీజ్ చేస్తాయో ఇప్పుడు చూద్దాం.
Read Also:US-India Trade Deal: భారతదేశంతో త్వరలో వాణిజ్య ఒప్పందం: యూఎస్ వాణిజ్య కార్యదర్శి..
జూన్లో సుజుకి ఇ యాక్సెస్ లాంచ్
సుజుకి తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ సుజుకి ఇ యాక్సెస్ను జూన్ 2025లోనే విడుదల చేయనుంది. ఈ స్కూటర్ను కంపెనీ జూన్ 11, 2025న విడుదల చేయనున్నారు. ఇందులో కొన్ని సూపర్ ఫీచర్లు ఉంటాయి. ఈ స్కూటర్ను జనవరి 2025లో జరిగిన ఆటో ఎక్స్పోలో ప్రవేశపెట్టారు. సుజుకి ఇ యాక్సెస్ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.10 లక్షల నుంచి రూ. 1.30 లక్షల మధ్య ఉండవచ్చు.
Read Also:Rahul Gandhi: రాహుల్గాంధీ హర్యానా టూర్పై సర్వత్రా ఉత్కంఠ
హీరో విడా VX2 జూలైలో విడుదల
హీరో మోటోకార్ప్ విడా పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్లను అమ్మకానికి అందుబాటులో ఉంచుతుంది. జూలైలో భారతదేశంలో విడా VX2 ఎలక్ట్రిక్ స్కూటర్ను అధికారికంగా విడుదల చేయనున్నారు. జూలై 1, 2025న కంపెనీ రెండు స్కూటర్లను విడుదల చేయనుంది. వీటి ధర ప్రస్తుత మోడళ్ల కంటే తక్కువగా ఉండవచ్చు. సమాచారం ప్రకారం, ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ. 80 వేలు ఉండవచ్చు.
Read Also:Kamareddy: నిజాం సాగర్ బ్యాక్ వాటర్ లో గల్లంతైన ముగ్గురు యువకుల కోసం గాలింపు..
టీవీఎస్ ఐక్యూబ్
టీవీఎస్ మోటార్స్ ప్రస్తుతం ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు వేరియంట్లను మార్కెట్లో అందుబాటులోకి తెస్తోంది. త్వరలో ఈ స్కూటర్ చౌకైన వేరియంట్ కూడా విడుదల కానుంది. సమాచారం ప్రకారం కంపెనీ తన కొత్త స్కూటర్ను పండుగ సీజన్లో లాంచ్ చేయవచ్చు. ఈ స్కూటర్ను దాదాపు రూ. 70 వేల ఎక్స్-షోరూమ్ ధరకు ప్రవేశపెట్టవచ్చు.
Read Also:Jagtial: పామును కాపాడబోయిన ఆర్టీసీ డ్రైవర్.. బస్సు గేర్ బాక్స్ లో చొరబడిన పాము.. చివరకు
యమహా కొత్త స్కూటర్
యమహా కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో తన మొదటి ఉత్పత్తిని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. తయారీదారు రాబోయే కొన్ని నెలల్లో తన కొత్త, మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ను మార్కెట్లోకి ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ స్కూటర్ను పరీక్షిస్తున్నారు. యమహా నుంచి కొత్త స్కూటర్ను ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.30 లక్షల నుంచి రూ. 1.50 లక్షల వరకు విడుదల చేయొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.