. < 1 minute

కరీంనగర్​జిల్లా రేణికుంటలో భార్య కేసు పెట్టిందని భర్త సూసైడ్

Caption of Image.
  • కరీంనగర్​జిల్లా రేణికుంటలో ఘటన

తిమ్మాపూర్, వెలుగు:  భార్య అదనపు కట్నం కేసు పెట్టిందని భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్​జిల్లాలో జరిగింది.  గ్రామస్తులు తెలిపిన  ప్రకారం.. తిమ్మాపూర్‌‌ మండలం రేణికుంట గ్రామానికి చెందిన నల్లాల జీవన్ రెడ్డి(37) కి,  చిన్నకోడూరు మండలం ఎల్లయ్యపల్లె (చలకాలపల్లి) గ్రామానికి చెందిన దీపతో కొన్నేండ్ల కింద పెండ్లయింది.

 వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇటీవల దంపతుల మధ్య కలహాలు తలెత్తడంతో  దీప భర్తతో పాటు అత్త,మామ, మరిదిపై అదనపు కట్నం కేసు నమోదు పెట్టింది. వీళ్లు అరెస్ట్ అయిన అనంతరం స్టేషన్ బెయిల్ పై వచ్చారు. భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపం చెందిన జీవన్ రెడ్డి సోమవారం ఉదయం ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. స్థానికుల సమాచారంతో ఎల్ఎండీ పోలీసులు వెళ్లి  కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

©️ VIL Media Pvt Ltd.
Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.