
సౌత్ ఇండస్ట్రీలోని అత్యంత డిమాండ్ ఉన్న దర్శకులలో మణిరత్నం ఒకరు. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన ఆయన.. ఇప్పుడు థగ్ లైఫ్ సినిమాను తెరకెక్కించారు. తమిళ్ హీరో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈసినిమాపై మంచి హైప్ నెలకొంది. నాయకన్ సినిమా తర్వాత దాదాపు 35 ఏళ్లకు వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో త్రిష, శింబు, అభిరామి కీలకపాత్రలు పోషిస్తున్నారు. జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు.
అయితే ఈ సినిమా కోసం హీరో శింబు తీసుకుంటున్న పారితోషికం విషయం ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ చిత్రానికి శింబు దాదాపు రూ.40 కోట్లు అందుకుంటున్నట్ల సమాచారం. దాదాపు ఏడాదిన్నరపాటు ఈ చిత్రంలో నటించేందుకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాక్. ఇందులో శింబు పాత్ర చాలా పవర్ ఫుల్ కీలకంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
థగ్ లైఫ్ సినిమాతోపాటు శింబు చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. STR 49, 50, 51 చిత్రాల్లో నటిస్తున్నారు. STR 49 చిత్రానికి దర్శకుడు రాజ్కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వం వహిస్తారు. ఈ చిత్రం షూటింగ్ పూజలు ఏప్రిల్ 2025 చివరిలో జరిగాయి. ఇందులో కయాదు లోహర్ కథానాయికగా నటిస్తుంది. అలాగే శింబు 50వ సినిమాను దర్శకుడు దేశింగ్ పెరియసామి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో నటుడు శింబు ట్రాన్స్జెండర్ పాత్రలో కనిపించనున్నారు.
ఇవి కూడా చదవండి :
OTT Movie: ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న క్రైమ్ సస్పెన్స్.. ఊహించని మలుపులు.. క్షణ క్షణం ఉత్కంఠ..
Nagarjuna: టాలీవుడ్ని ఏలేసిన హీరోయిన్.. కానీ నాగార్జునతో ఒక్క సినిమా చేయలేదు.. ఎందుకంటే..
Tollywood: ఇండస్ట్రీలో తోపు నటుడు.. కోట్లు వదిలి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్న హీరో.. కారణం ఇదే..
OTT Movie: ఇదెందీ మావ.. థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీని ఊపేస్తోంది.. దేశంలోనే టాప్ ట్రెండింగ్..