
పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. రోజు రోజుకు మరింతపైకి ఎగబాకుతున్నాయి. నేడు తులంపై రూ. 200 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,906, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,080 వద్ద ట్రేడ్ అవుతోంది. గోల్డ్ ధరలతో పాటు వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 200 పెరిగింది. దీంతో రూ. 90,800 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 220 పెరిగింది. దీంతో రూ. 99,060 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
Also Read: Himanta Biswa Sarma: ‘‘చైనా బ్రహ్మపుత్ర నీటిని ఆపేస్తే ఎలా..?’’ అస్సాం సీఎం అదిరిపోయే సమాధానం..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 200 పెరిగింది. దీంతో రూ. 90,950 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 70 పెరిగింది. దీంతో రూ. 99,060 వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారం ధరలు పరుగులు పెడుతుండగా వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. నేడు కిలో వెండిపై రూ. 100 పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,11,100 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,00,100 వద్ద ట్రేడ్ అవుతోంది.