
హుజూర్ నగర్, వెలుగు : ఏటీఎం చోరీ నిందితులను త్వరలో పట్టుకుంటామని ఎస్పీ నరసింహ అన్నారు. సోమవారం హుజూర్ నగర్ లో ఏటీఎం చోరీ జరిగిన ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ హుజూర్ నగర్ లో జరిగిన ఏటీఎం చోరీకి హర్యానా రాష్ట్రానికి చెందిన గ్యాంగ్ చేసినట్లు అనుమానిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఇదే తరహా ఏటీఎం దోపిడీ గ్యాంగ్ ను పట్టుకున్నామని చెప్పారు.
పక్కా ప్రొఫెషనలిజంతో కూడిన గ్యాంగ్ ఈ దోపిడీకి పాల్పడిందన్నారు. గ్యాంగ్ ను పట్టుకునేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నామని, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశోధించి త్వరలోనే కేసును చేధిస్తామని తెలిపారు. ఏటీఎం దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయని చెప్పారు. ప్రజల రక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సేఫ్ హుజూర్ నగర్ కోసం ప్రయత్నిస్తామని తెలిపారు. ఆయన వెంట సీఐ చరమందరాజు తదితరులు ఉన్నారు.