
ధనుష్, నాగార్జున హీరోలుగా శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న చిత్రం ‘కుబేర’. రష్మిక మందన్న హీరోయిన్. బాలీవుడ్ నటుడు జిమ్ సర్ఫ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. జూన్ 20న పాన్ ఇండియా వైడ్గా సినిమా విడుదల కానుంది. చెన్నైలో ఈ మూవీ ఆడియో లాంచ్ ఆదివారం (జూన్ 1న్) నిర్వహించారు.
ఈ సందర్భంగా ధనుష్ మాట్లాడుతూ ‘ఇది కలికాలం, ద్వేషం, ప్రతికూలత, అసూయ వృద్ధి చెందే సమయం. చెడు మంచిపై విజయం సాధిస్తున్నట్లు అనిపిస్తుంది. ఇలాంటి కాన్సెప్ట్తో శేఖర్ కమ్ముల గారు ఈ చిత్రాన్ని రూపొందించారు. తిరుపతి ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించి, బిచ్చగాడిగా నటించడం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. తనను ద్వేషిస్తూ, నెగటివ్ ప్రచారం చేస్తున్న వాళ్లు తననేమీ చేయలేరని అన్నాడు. ఒకప్పుడు ఒకే పూట తిన్న రోజులు కూడా ఉన్నట్లు గుర్తు చేసుకున్నాడు
ఆ అనుభవం జీవితంలోని ముఖ్యమైన సత్యాలను గుర్తు చేసింది. అలాగే కాశీ ఘాట్లో చితి మంటల మధ్య జరిగిన చిత్రీకరణతో దురాశ, డబ్బు, ప్రాపంచిక సుఖాలు ఏమీ శాశ్వతం కాదని అర్ధమైంది. స్వచ్ఛమైన మనసు ముఖ్యం. కుబేర దానిని తెలియజేస్తుంది. ఈ చిత్రం చూపే ఇంపాక్ట్ గురించి నాకు 200% నమ్మకం ఉంది’ అని అన్నాడు.
అలాగే ధనుష్ తనపై జరుగుతున్న పుకార్ల దాడిపై మాట్లాడుతూ.. ‘నా గురించి ఎవరెన్ని రూమర్స్ ఐనా పుట్టించండి. ఐ డోంట్ కేర్. ఇలా నా ప్రతి మూవీ రిలీజ్ కు ముందు ప్రతిసారి నెలన్నర రోజుల నుంచి ఈ నెగటివ్ ప్రచారం స్టార్ట్ అవుతుంది. కానీ మీరేమీ చేయలేరు ఎందుకంటే నా అభిమానులే నాకు బలమైన మూలస్తంభాలు. వాళ్లు 23 ఏళ్లుగా నాతో ఉన్నారు. నా గురించి పుకార్లు పుట్టిస్తూ నన్ను పడగొట్టాలని మీరు అనుకుంటే.. అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు. ఒక్క ఇటుక కూడా కదపలేరని’ ధనుష్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Never seen this D in these Years @dhanushkraja 🛐❤️🔥
Cut & Right Reply To The Haters !!!#KuberaaAudioLaunch #Kuberaa pic.twitter.com/eqxDzMPcv0
— Dhanush Thambinga Da (@dtd_team) June 1, 2025
అయితే, ఈ ధనుష్ మాట్లాడిన ఈ ఎమోషనల్ మాటలు.. హీరోయిన్ నయనతారను ఉద్దేశించి చేసినట్టుగా తెలుస్తోంది. గతంలో నయనతార పెళ్లి వీడియోపై వీరిద్దరి మధ్య దుమారం రేగిన విషయం తెలిసిందే!
ఇక ఇదే ఈవెంట్ లో.. నాగార్జున మాట్లాడుతూ.. ‘ఈ చిత్రం కచ్చితంగా అందరికీ నచ్చేలా ఉంటుందని’ అన్నారు. తన కెరీర్లో ఇది చాలా స్పెషల్ ఫిల్మ్ అని రష్మిక చెప్పింది. శేఖర్ కమ్ముల మాట్లాడుతూ ‘ఇదొక బ్రిలియంట్ ఫిల్మ్. ధనుష్, నాగార్జున గారి పెర్ఫార్మెన్స్ మెస్మరైజింగ్గా ఉంటుంది’అని చెప్పారు.
సినిమా అవుట్పుట్ చాలా బాగా వచ్చిందని, జూన్ 20న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నామని నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ నికేత్ బొమ్మి, ప్రొడక్షన్ డిజైనర్ తోట తరణి, లిరిక్ రైటర్ చంద్రబోస్ పాల్గొన్నారు.