. < 1 minute

ఆస్ట్రేలియా పోలీసుల దాష్టీకం.. కోమాలో భారతీయుడు, అసలేమైంది?

Caption of Image.

ఆస్ట్రేలియాలో పోలీసులు భారత సంతతికి చెందిన 42 ఏళ్ల గౌరవ్ కుంది పట్ల దారుణంగా వ్యవహరించారు. సదరు వ్యక్తిని అరెస్ట్ చేసే క్రమంలో పోలీసులు అతని మెడపై బలంగా మోకరిల్లటం మెదడుకు తీవ్రమైన గాయం జరిగింది. దీంతో ప్రస్తుతం అతడు కోమాలో ఉన్నట్లు వెల్లడైంది. అయితే దీనిని చూసిన చాలా మంది సంఘటన అమెరికాలోని మిన్నియాపాలిస్‌లో జార్జ్ ఫ్లాయిడ్ హత్యను గుర్తుచేస్తోందని అంటున్నారు. 

అక్కడి స్థానిక మీడియాలో వచ్చిన విజువల్స్ ప్రకారం పోలీసులు గౌరవ్ ను అడిలైడ్ తూర్పు శివారు ప్రాంతంలోని రోడ్డుపైకి బలవంతంగా తీసుకెళ్తున్న దృశ్యాల్లో కనిపించింది. ఆ సమయంలో అతడితో ఉన్న భార్య తాము అమాయకులమంటూ కేకలు వేశారు. పైగా తాము ఎలాంటి తప్పు చేయలేదని పోలీసులు తమను అన్యాయంగా ఇబ్బంది పెడుతున్నారని వారు పేర్కొన్నారు. పోలీసులు గౌరవ్ ను నేలకేటి కొట్టడంతో అక్కడికక్కడే స్ప-ృహ కోల్పోయాడు. మోకాలితో మెడపై నొక్కటం కారణంగా తన భర్తకు బలమైన దెబ్బలు తగిలాయని అతని భార్య వెల్లడించింది. అలాగే తన భర్త తల పోలీసు వాహనాన్ని డీకొట్టిందని వెల్లడించింది.

►ALSO READ | గ్రీస్ లో భారీ భూకంపం : టర్కీ సిటీలో జనం పరుగులు

అయితే అతని పరిస్థితి విషమించటంతో పోలీసులు అతడిని స్టేషనుకు తరలించకుండా ఆసుపత్రికి తీసుకెళ్లారని గౌరవ్ భార్య వెల్లడించారు. ప్రస్తుతం తన భర్త ఐసీయూలో వెంటిలేటరుపై చికిత్స పొందుతున్నారని పేర్కొంది. కుండి.. అతని భాగస్వామి మధ్య వాగ్వాదం జరిగిన తర్వాత పోలీసులు జోక్యం చేసుకున్నానరని తెలుస్తోంది. అయితే సదరు వ్యక్తిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా హింసాత్మకంగా ప్రతిఘటించాడని అధికారులు చెబుతున్నారు. 

©️ VIL Media Pvt Ltd.
Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.