బొప్పాయి పండు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. శరీరానికి శక్తిని కూడా ఇస్తుంది. అయితే, బొప్పాయి పండు విత్తనాలను మనం చెత్తగా భావించి పడేస్తాము. కానీ, ఈ విత్తనాల ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయి. ఈ నల్లటి బొప్పాయి గింజలు బరువు తగ్గడంలో ఎంతో సహాయపడతాయి. పోషకాలతో సమృద్ధిగా ఉన్న ఈ విత్తనాలు అనేక తీవ్రమైన వ్యాధులతో పోరాడే శక్తిని కలిగి ఉంటాయి. కాగా, బొప్పాయి గింజలు ఎలాంటి సమస్యలలో పని చేస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తరచుగా అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు ఉంటే బొప్పాయి గింజలు ఒక వరంలా పనిచేస్తాయి. ఇందులో ‘పపైన్’ అనే ఎంజైమ్ ఉంటుంది. కావున ఈ పండు విత్తనాలు ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడంలో, ఆహారాన్ని బాగా జీర్ణం చేయడంలో ఎంతో సహాయపడుతుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. అంతేకాకుండా కడుపు సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.
నేటి కాలంలో మనం తీసుకునే ఆహారం, జీవనశైలి కాలేయంపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. అయితే బొప్పాయి గింజలు కాలేయాన్ని క్లీన్ చేసి ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతో సహాయపడతాయి. ఈ పండు గింజలు కాలేయాన్ని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడుతాయి. అంతేకాకుండా కాలేయ సిర్రోసిస్ వంటి తీవ్రమైన సమస్యలలో కూడా ఈ పండి విత్తనాలు సహాయపడతాయి.
మన మూత్రపిండాలు మన శరీరం నుండి వ్యర్థ పదార్థాలను తొలగించడానికి పనిచేస్తాయి. బొప్పాయి గింజలు మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా సహాయపడతాయి. ఈ బొప్పాయి పండు గింజలు మూత్రపిండాలను క్లీన్ చేయడంలో, దాని పనితీరును మెరుగుపరచడంలో ఎంతో సహాయపడతాయి.
బొప్పాయి గింజలను ఆహారంలో ఎలా చేర్చుకోవాలి?
బొప్పాయి గింజలు కొద్దిగా చేదుగా ఉంటాయి. కావున వాటిని ఎండబెట్టి పొడిగా చేసి సలాడ్లు లేదా గంజిలో కలిపి తీసుకోవచ్చు. ప్రారంభం దశలో ఈ పొడిని తక్కువ పరిమాణంలో తీసుకోవడం మంచిది. తర్వాత నెమ్మదిగా పెంచుతూ పోతే సరిపోతుంది.
నోట్ : పైన సేకరించిన సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా పబ్లిష్ చేస్తున్నాము. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి.