
శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల నుంచి నీరు కిందపడే ప్రాంతంలో భారీ గుంత ఏర్పడి.. అది అంతకంతకూ పెరిగి పునాదులు బయటపడుతున్నాయి. ఫ్లంజ్ పూల్ సర్వే చేస్తున్న పరిశోధకులకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి.
తాజాగా శ్రీశైలం డ్యామ్ వద్ద కేబుల్ వే మొరాయించడంతో సర్వేకు ఇబ్బంది కలుగుతుందని సైంటిస్టుల నుంచి సమాచారం అందుతోంది. జలాశయంలో సర్వే చేపట్టిన బృందానికి కేబుల్ ద్వారా వెనుక నుండి ముందుకు బోటు సర్వే మెటీరియల్ తరలించేందుకు సిద్ధం చేసిన కేబుల్ వే లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో జలాశయం అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా బయటపడడంతో శాస్త్రవేత్తలు సర్వేకు ఆటంకం కలిగింది.
వాస్తవానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ శ్రీశైలం డ్యామ్ దుస్థితిపై గతంలోనే ఆందోళన వ్యక్తం చేసింది.డ్యామ్ దగ్గర నీరు భూమిని కోసుకుంటూ వెళ్లడంతో.. డ్యామ్ అడుగు భాగానికి కూడా ఆ గుంత వ్యాపిస్తుందని.. దాని వల్ల డ్యామ్ పునాదులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందంటున్నారు. ఇలా శ్రీశైలం ప్రాజెక్టుకు పెద్ద ప్రమాదం పొంచి ఉందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెబుతోంది.
►ALSO READ | తిరుపతిలో దోపిడి దొంగలు హల్చల్.. భయాందోళనలో స్థానికులు
శ్రీశైలం డ్యామ్ స్పిల్వే నుంచి గేట్లు ఎత్తి నీళ్లు కిందకు వదిలిన సమయంలో.. ఎత్తైన ప్రదేశం నుంచి నీళ్లు నేలపై పడితే గుంతలా ఏర్పడుతుంది. ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గర కూడా అదే జరుగుతోంది.. శ్రీశైలం డ్యామ్ గేట్లు తెరిచిన సమయంలో నీళ్లు పడిన చోట భూమిపై గుంత ఏర్పడి ప్రాజెక్ట్ పునాదుల వరకు వెళుతోంది.. దానిని ప్లంజ్ పూల్ అంటారు. అలా నీళ్లు పడటంతో రివర్ బెడ్ను కోసేస్తోంది.. ఆ క్రమంలో గుంత పెద్దది అవుతుంది. ప్రస్తుతం ఏర్పడిన గుంత చాలా లోతు ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.