. < 1 minute
Janagama Man Walks To Hyderabad Seeking Help From Prabhas Sonu Sood

Medical Assistance: జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని వెంకటాద్రి పేట గ్రామానికి చెందిన రాజు అనే యువకుడు ఆరోగ్య సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నాడు. మెడ నరాలలో సమస్య కారణంగా తీవ్రమైన క్షీణతకు గురవుతున్న ఆయన, వైద్య చికిత్సకు అవసరమైన ఖర్చును భరించలేని పరిస్థితిలో ఉన్నాడు. రాజుకు అవసరమైన చికిత్స కోసం దాదాపు ఆరు లక్షల రూపాయల ఖర్చు అవుతుందని అంచనా. గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్న రాజు ఆ మొత్తంను భరించే ఆర్థిక స్థితిలో లేడు. ఈ క్రమంలో తన సమస్యను ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు ఓ అసాధారణమైన మార్గాన్ని ఎంచుకున్నాడు.

Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ఎలా అయ్యారో చూడండి.. కొత్త ఫొటో వైరల్!

తన బతుకుదెరువు కోసం, తన వైద్య ఖర్చులకు కొంత ఆర్థిక సహాయం అందాలని కోరుతూ, సినీ నటులు సోనూ సూద్‌, ప్రభాస్‌లను కలిసేందుకు రాజు పాదయాత్రగా హైదరాబాద్‌కు బయలుదేరాడు. వెంకటాద్రి పేట గ్రామం నుంచి ప్రారంభించిన ఈ ప్రయాణంలో, హీరోల ఫ్లెక్సీలను తనతో కలిపుకొని, వారిని కలవాలన్న ఆకాంక్షతో మైళ్ల కొద్దీ నడుస్తున్నాడు.

సోనూ సూద్ ఇప్పటికే ఎంతోమంది అవసరంలో ఉన్నవారికి సహాయం చేసిన నేపథ్యంలో, అతనిని చేరుకోవాలని రాజు భావిస్తున్నాడు. అలాగే టాలీవుడ్ స్టార్ ప్రభాస్‌ను కూడా కలిసి తన ఆరోగ్య పరిస్థితిని వివరించాలని అతని ఆశ. “నన్ను ఆదుకోండి… నా జీవితాన్ని నిలబెట్టండి” అనే పిలుపుతో రాజు తను నడుస్తున్న ప్రతి అడుగులో ఓ ఆశను మోస్తున్నాడు. రాజు చేసిన ఈ వినూత్న ప్రయత్నం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో కూడా ఇతని పాదయాత్ర గురించి కొంత ప్రచారం జరుగుతోంది.

Tuni Train Burning Case: తుని రైలు దగ్ధం కేసుపై సర్కార్‌ కీలక నిర్ణయం.. ఆ ఆలోచన లేదు..!

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.