
అమరావతి, జూన్ 3: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు 2025 మే 12 నుంచి మే 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు రాసిన వేలాది మంది విద్యార్థులు ప్రస్తుతం ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీళ్ల నిరీక్షణకు త్వరలో తెరపడనుంది. తాజాగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. అదేంటంటే.. జూన్ మొదటి వారంలో ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ 2025 విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈఏపీసెట్, నీట్, జేఈఈ వంటి కీలక ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రారంభంకానున్న నేపథ్యంలో వీలైనంత త్వరలోనే ఫలితాలను వెల్లడించాని అధికారులు భావిస్తున్నారు. జూన్ 8 నుంచి 10వ తేదీలోపు ఫలితాలు విడుదల ఎప్పుడైనా విడుదల చేసే అవకాశం ఉంది.
కాగా ఆంధ్రప్రదేశ్లో మే 12వ తేదీ నుంచి మే 20వ తేదీ వరకు జరిగిన ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇంటర్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులతోపాటు ఆయా సబ్జెక్టుల స్కోర్లను మెరుగుపరచు కోవాలనుకున్న విద్యార్థులు (ఇంప్రూవ్మెంట్) సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలైన తర్వాత అధికారిక వెబ్సైట్లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. అలాగే మన మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా కూడా తెలుసుకోవచ్చు.
తెలంగాణ ఐసెట్ 2025 అడ్మిట్ కార్డులు విడుదల.. రాత పరీక్ష తేదీలివే
తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ 2025 (ఐసెట్) పరీక్షల అడ్మిట్ కార్డులు తాజాగా విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఐసెట్ ఆన్లైన్ పరీక్షలు జూన్ 8, 9 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో జరగనున్నాయి. ఇందులో వచ్చిన ర్యాంకు ద్వారా 2025-26 విద్యా సంవత్సరానికి రెండేళ్ల ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
తెలంగాణ ఐసెట్ 2025 అడ్మిట్ కార్డుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.