. < 1 minute
Why Frequent Earthquakes Hitting Near Pakistan Nuclear Sites

Pak Nuclear Sites: ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాకిస్తాన్ కు ఇండియన్ ఆర్మీ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. ఈ సందర్భంగా పాక్ లోని అణు నిల్వలు ఉన్న కిరాణా హిల్స్ సమీపంలో భారత్ దాడులు చేసినట్లు సమాచారం. దీనిపై ఇప్పటి వరకు రెండు దేశాలు అధికారికంగా స్పందించినప్పటికీ.. అక్కడ జరిగిన దాడితో తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌లోని కరాచీ నివాసితులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతి మూడు గంటలకు ఒకసారి స్వల్ప భూకంపం వస్తుందని పేర్కొన్నారు. అయితే, ఇప్పటి వరకు 19 స్వల్ప భూకంపాలు సంభవించాయని వెల్లడించారు. అలాగే, ఈరోజు (మంగళవారం) ఉదయం 9:57 గంటలకు 2.8 తీవ్రతతో భూకంపం వచ్చిందని అన్నారు. ఈ భూకంపాలు ముఖ్యంగా పాకిస్తాన్ అణ్వాయుధ సామగ్రి నిల్వలకు సమీపంలో ఉన్న మాలిర్, లాంధి, క్వాయిదాబాద్ వంటి ప్రాంతాల్లోనే సంభవిస్తున్నాయని వెల్లడించారు.

Read Also: Ambati Rambabu: సీఎం చంద్రబాబుకు కాపులు అంటే ఎందుకంత కోపం..?

కాగా, పాకిస్తాన్ వాతావరణ శాస్త్రవేత్త అమీర్ హైదర్ తెలిపిన వివరాల ప్రకారం.. లంధి ఫాల్ట్ లైన్ క్రియాశీలతే ఈ భూకంపాలకు ప్రధాన కారణం అన్నారు. ఇది ప్రస్తుతం విస్తృత పరిస్థితులకు దారి తీసే ప్రమాదం ఉందన్నారు. ఈ ఫాల్ట్ లైన్‌లో పెద్ద భూకంపం రాలేదు.. ఇప్పుడు దానికి సంబంధించిన శక్తి నెమ్మదిగా బయటకు వస్తోందని పేర్కొన్నారు. దీని వల్ల చిన్న భూకంపాలు సంభవిస్తున్నాయని.. ఇవి భవిష్యత్తులో పెద్ద భూకంపాలుగా ఏర్పడే అవకాశాలను తగ్గించడంలో సహాయపడతాయని తెలిపారు. ఈ భూకంపాల కారణంగా ఎటువంటి పెద్ద నష్టం సంభవించదు.. కానీ, ప్రజల్లో భయాందోళనలు మాత్రం ఖచ్చితంగా పెరుగుతాయని చెప్పారు. ఈ భూకంపాల పరంపర వచ్చే వారం వరకు కొనసాగవచ్చని వాతావరణ శాస్త్రవేత్త అమీర్ హైదర్ సూచించారు.

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.