
Pak Nuclear Sites: ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాకిస్తాన్ కు ఇండియన్ ఆర్మీ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. ఈ సందర్భంగా పాక్ లోని అణు నిల్వలు ఉన్న కిరాణా హిల్స్ సమీపంలో భారత్ దాడులు చేసినట్లు సమాచారం. దీనిపై ఇప్పటి వరకు రెండు దేశాలు అధికారికంగా స్పందించినప్పటికీ.. అక్కడ జరిగిన దాడితో తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్లోని కరాచీ నివాసితులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతి మూడు గంటలకు ఒకసారి స్వల్ప భూకంపం వస్తుందని పేర్కొన్నారు. అయితే, ఇప్పటి వరకు 19 స్వల్ప భూకంపాలు సంభవించాయని వెల్లడించారు. అలాగే, ఈరోజు (మంగళవారం) ఉదయం 9:57 గంటలకు 2.8 తీవ్రతతో భూకంపం వచ్చిందని అన్నారు. ఈ భూకంపాలు ముఖ్యంగా పాకిస్తాన్ అణ్వాయుధ సామగ్రి నిల్వలకు సమీపంలో ఉన్న మాలిర్, లాంధి, క్వాయిదాబాద్ వంటి ప్రాంతాల్లోనే సంభవిస్తున్నాయని వెల్లడించారు.
Read Also: Ambati Rambabu: సీఎం చంద్రబాబుకు కాపులు అంటే ఎందుకంత కోపం..?
కాగా, పాకిస్తాన్ వాతావరణ శాస్త్రవేత్త అమీర్ హైదర్ తెలిపిన వివరాల ప్రకారం.. లంధి ఫాల్ట్ లైన్ క్రియాశీలతే ఈ భూకంపాలకు ప్రధాన కారణం అన్నారు. ఇది ప్రస్తుతం విస్తృత పరిస్థితులకు దారి తీసే ప్రమాదం ఉందన్నారు. ఈ ఫాల్ట్ లైన్లో పెద్ద భూకంపం రాలేదు.. ఇప్పుడు దానికి సంబంధించిన శక్తి నెమ్మదిగా బయటకు వస్తోందని పేర్కొన్నారు. దీని వల్ల చిన్న భూకంపాలు సంభవిస్తున్నాయని.. ఇవి భవిష్యత్తులో పెద్ద భూకంపాలుగా ఏర్పడే అవకాశాలను తగ్గించడంలో సహాయపడతాయని తెలిపారు. ఈ భూకంపాల కారణంగా ఎటువంటి పెద్ద నష్టం సంభవించదు.. కానీ, ప్రజల్లో భయాందోళనలు మాత్రం ఖచ్చితంగా పెరుగుతాయని చెప్పారు. ఈ భూకంపాల పరంపర వచ్చే వారం వరకు కొనసాగవచ్చని వాతావరణ శాస్త్రవేత్త అమీర్ హైదర్ సూచించారు.