
Telangana Jagruthi : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కాళేశ్వరం ప్రాజెక్ట్పై కమిషన్ నోటీసులు ఇచ్చినందుకు నిరసనగా తెలంగాణ జాగృతి భారీ ధర్నాకు పిలుపునిచ్చింది. జూన్ 4న బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ మహాధర్నా ఇందిరా పార్క్ వద్ద జరగనుంది. ఈ ధర్నాను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వయంగా నేతృత్వం వహించనున్నారు. కేంద్ర సంస్థలు కేసీఆర్పై టార్గెట్ చేసినట్లు ఆరోపిస్తూ, ఇది రాజకీయ కుట్రగా అభివర్ణిస్తూ జాగృతి నిరసన కార్యక్రమాన్ని చేపట్టనుంది.
IPL History: ఐపీఎల్ చరిత్రలో 20వ ఓవర్ను మెయిడెన్ చేసిన అతి భీకర బౌలర్స్ ఎవరో తెలుసా..?
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కు సంబంధించి విజిలెన్స్, NDSA నివేదికల అనంతరం కేసీఆర్కు నోటీసులు రావడం, దానిపై తెలంగాణ భవనుల నుండి కార్యకర్తల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ మహాధర్నా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ మాజీ సీఎం ప్రతిష్టను దెబ్బతీయాలని జరుగుతున్న చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జాగృతి ఈ నిరసన చేపడుతోందని కవిత పేర్కొన్నారు. ఈ మహాధర్నాలో జాగృతి కార్యకర్తలు, తెలంగాణ సంస్కృతి సంఘాల ప్రతినిధులు, నాయకులు భారీగా పాల్గొనే అవకాశం ఉంది. అధికార సంస్థల నిర్ణయాలను ప్రశ్నించే స్థాయిలో ఇది కీలక కార్యక్రమంగా మారనుంది.
Sama Ram Mohan Reddy : దళితుల పేరిట లూటీ.. ఆర్ఎస్ ప్రవీణ్పై రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు