
= 240 మంది పిల్లల కోడింగ్ రూ. 4 కోట్లా?
= గురుకులాలపై విజిలెన్స్ విచారణ చేయాలె
= బండారం బయటపెట్టిన సామ రామ్మోహన్ రెడ్డి
హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల పనిచేసిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అంబేద్కర్ పేరు చెప్పి ఆయన రాసిన రాజ్యాంగాన్ని తుంగలతో తొక్కారని టీపీసీసీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి అన్నారు. తన హయాంలో గురుకులాలు వెలిగిపోయాయంటూ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
240 మంది పిల్లలకు కోడింగ్ చేసేందుకు రూ. 4 కోట్లు ఖర్చు చేశారని, మూడు సంస్థల పేరుతో కోడింగ్ నేర్పిస్తానని రెండింటికి అనుమతి తీసుకున్నారన్నారు. ఈ టెండర్ కూడా పూర్తి చేయలేద ని అన్నారు. ఐఐటీ, జేఈఈ ఆన్లైన్ కోర్స్ కి 20 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పారు.
లక్ష 20 వేల మందికి కోడింగ్ కి శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. గురుకుల పాఠశాలల్లో అవినీతిపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణ జరిపించాలని కోరారు. పిల్లల యూనిఫామ్స్..దుప్పట్లనూ వదల్లేదని ఆరోపించారు