
ఐపీఎల్ 2025 ఫైనల్ కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు దిగ్గజ ఆటగాళ్ల సపోర్ట్ లభిస్తుంది. ఆర్సీబీ జట్టు గెలవాలని.. బెంగళూరు జట్టు విజేతగా నిలుస్తుందని చాలా మంది దిగ్గజాలు తమ జోస్యాన్ని చెప్పారు. ఆర్సీబీని ఫైనల్ మ్యాచ్ లో సపోర్ట్ చేయడానికి మంగళవారం (జూన్ 3) మాజీ ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ అహ్మదాబాద్ చేరుకున్నారు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో జరగబోయే ఈ ఫైనల్ మ్యాచ్ కు వీరిద్దరూ రావడం బెంగళూరు ఫ్యాన్స్ లో జోష్ నింపుతుంది.
ఐపీఎల్ 2025లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు చేరుకున్న తర్వాత తమ జట్టు ఫైనల్ కు వస్తే మ్యాచ్ చూడడానికి వస్తానని డివిలియర్స్ చెప్పాడు. అన్న మాట నిలబెట్టుకున్న ఈ సౌతాఫ్రికా మాజీ విధ్వంసకర వీరుడు ఐపీఎల్ ఫైనల్ కు హాజరవుతున్నారు. ఇక యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఆర్సీబీ సపోర్ట్ చేయడానికి గ్రౌండ్ కు రాబోతున్నాడు. డివిలియర్స్, గేల్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున చాలా సీజన్ ల పాటు ఆడాడు. వీరిద్దరూ ఉన్నంత కాలం ఆర్సీబీ జట్టుకు తిరుగు లేకుండా పోయింది. 2016 లో బెంగళూరు జట్టు ఐపీఎల్ ఫైనల్ కు వచ్చినప్పుడు గేల్, డివిలియర్స్ జట్టులో కీలక ప్లేయర్స్.
Ab de Villiers has reached Ahmadabad #RCB #RCBvsPBKS #IPLFinal #iplfinal2025 pic.twitter.com/oAxpf0614y
— Mr X (@viratking02) June 3, 2025
స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ సన్ రైజర్స్ చేతిలో బెంగళూరు ఓడిపోవడం జట్టులోని అందరి ప్లేయర్లను తీవ్రంగా బాధించింది. నేడు జరగనున్న ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిస్తే తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంటుంది. అదే జరిగితే 2016 లో ఐపీఎల్ ఫైనల్లో ఎదురైనా చేదు జ్ఞాపకాలను ఈ దిగ్గజాలను మర్చిపోవచ్చు. ఈ మ్యాచ్ లో పంజాబ్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. ముంబై ఇండియన్స్ పై విజయం ఆ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. మరోవైపు బెంగళూరు అంతకు మించిన కాన్ఫిడెంట్ తో బరిలోకి దిగుతుంది. ఎవరు గెలిచినా ఐపీఎల్ లో చరిత్రే.
Universe Boss Chris Gayle has arrived at Ahmedabad ❤️ pic.twitter.com/i3rkoXNEgE
— Virat Kohli Fan Club (@Trend_VKohli) June 3, 2025
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తుది జట్టు విషయానికి వస్తే గాయం కారణంగా చివరి రెండు మ్యాచ్ లకు దూరమైన టిమ్ డేవిడ్ పూర్తి ఫిట్ నెస్ తో ఉన్నట్టు సమాచారం. ఫైనల్లో డేవిడ్ లివింగ్ స్టోన్ స్థానంలో ఆడనున్నాడు. ఈ ఒక్క మార్పు మినహాయిస్తే ఆర్సీబీ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేసే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతం జట్టులోని ఆటగాళ్లందరూ సూపర్ ఫామ్ లో ఉన్నారు. కెప్టెన్ రజత్ పటిదార్ ఫామ్ లోకి వస్తే బెంగళూరు జట్టుకు తిరుగుండదు. బౌలింగ్ లో అత్యంత దుర్బేధ్యంగా కనిపిస్తుంది. భువనేశ్వర్, హేజల్ వుడ్, సుయాష్ శర్మ, యష్ దయాల్ ఫైనల్ లో సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నారు.