
- 70 శాతం నాలాల కబ్జాలపైనే
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా ప్రజావాణికి సోమవారం 23 ఫిర్యాదులు రాగా, ఇందులో 70 శాతం వరకు నాలాల సమస్యలపైనే వచ్చాయి. కంప్లయింట్స్ను అడిషనల్ కమిషనర్ పాపయ్య స్వీకరించారు. సికింద్రాబాద్, తిరుమలగిరి, భూదేవినగర్లోని సాయిదత్తా గార్డెన్స్లో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఉద్దేశించిన 225 గజాల స్థలం కబ్జా అయ్యిందని స్థానికులు ఫిర్యాదు చేశారు.
2004లోనే బల్దియాకు ఆ స్థలాన్ని ఇచ్చి కమ్యూనిటీ హాల్ నిర్మించాలని కోరినా.. ఫలితం లేదన్నారు. శేరిలింగంపల్లి మండలంలోని ఖానామెట్ విలేజ్లో 11/20, 11/21 సర్వే నంబర్లలో 1983లో గురుకుల ట్రస్ట్లేఅవుట్ వేశారు. అందులోని ప్లాట్లతో పాటు రోడ్లు కబ్జాకు గురయ్యాయని స్థానికులు ఫిర్యాదు చేశారు.
నాలాల కబ్జాలపై..
బేగంపేటలోని చికోటి గార్డెన్స్ ప్రాంతంలో నాలా కుంచించుకుపోవడంతో బృందావన్ అపార్టుమెంట్లోకి వరద వచ్చి చేరుతోందని, 2020లో వరదలకు సెల్లార్ నీట మునిగిందని, ఇలా వర్షాకాలం వచ్చిందంటే ఇబ్బందులు పడుతున్నామని అపార్టుమెంటు వాసులు ఫిర్యాదు చేశారు. అలాగే, కూకట్పల్లి లోని రంగధాముని చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఆక్రమణలతో పాటు ఈ చెరువు నుంచి ఐడీఎల్ చెరువుకు వెళ్లే నాలా కూడా కబ్జాకు గురైందని స్థానికులు కంప్లయింట్చేశారు.
భారీ వర్షాలు పడితే ఏడు కాలనీలకు వరద ముప్పు పొంచి ఉంటోందని వాపోయారు. ఆక్రమణలు తొలగించి వరద సాఫీగా వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. హస్మత్పేట నాలా-, పికెట్ నాలాలు కుంచించుకుపోవడంతో బేగంపేట పరిసరాల్లో పాయిగా కాలనీ, విమాన్ నగర్, బీహెచ్ ఈఎల్ కాలనీ, అవంతి కాలనీ, రసూల్పురా బస్తీ వరదలో చిక్కుకుంటున్నాయని ఫిర్యాదు వచ్చింది.
సైదాబాద్, బాలాజీనగర్లో మురుగు, వరద కాలువలు కబ్జాకు గురయ్యాయని బాలాజీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రా దృష్టికి తెచ్చారు. ఓవైసీ దవాఖాన వద్ద చెరువు నిండితే వరద ఆదర్శ్నగర్ మీదుగా సరూర్నగర్ చెరువుకు చేరాల్సి ఉండగా.. వరద కాలువ కుంచించుకుపోవడంతో బస్తీలు నీట మునుగుతున్నాయని పేర్కొన్నారు.