నార్వే చెస్ టోర్నమెంట్
స్టావెంజర్: ప్రపంచ ఛాంపియన్ గుకేశ్ దొమ్మరాజు మరో సంచలన విజయం సాధించాడు. నార్వే చెస్ టోర్నమెంట్లో అద్భుత ఆటతీరుతో మాగ్నస్ కార్ల్సన్ మట్టికరిపించాడు. ఆదివారం జరిగిన మ్యాచ్లో.. వరల్డ్ నెంబర్ 1 కార్ల్సన్తో తలపడ్డాడు. అయితే.. కార్ల్సన్ మొదటి నుంచే తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు. చివరలో గుకేశ్ ఎత్తులకు ఆటపై పట్టు కోల్పోయాడు. ఆరో రౌండ్లో గుకేశ్ ఒక్కసారిగా ఆటను మలు పు తిప్పి విజయాన్ని అందుకున్నాడు. పాయిం ట్ల పట్టికలో 8.5 పాయింట్లతో మూడో స్థానానికిచేరుకున్నాడు.
గుకేశ్ కంటే ఒక పాయింట్తో మెరుగుగా ఉన్న మాగ్నస్ రెండో స్థానంలో, అమెరికా ప్లేయర్ ఫాబియానో కరూయానా తొలి స్థానంలో ఉన్నారు. అయితే ఓట మి తట్టుకోలేక కార్లసన్.. అసహనంతో బల్లను గట్టిగా గుద్దాడు. దీంతో చెస్ వుడెన్స్ అన్ని చెల్లాచెదురుగా పడిపోయాయి. ఆ తర్వాత గుకేశ్ ఇష్టం లేనట్లుగా షేక్ హ్యాండ్ ఇచ్చా డు. వెంటనే తేరుకున్న కార్లసన్ చెస్ వుడెన్స్ చక్కబెట్టె ప్రయత్నం చేశాడు. నిరాశలోనూ గుకేశ్ను అభినందించి, షేక్ హ్యాండ్ ఇచ్చాడు కార్ల్సన్. మ్యాచ్ అనంతరం గెకేశ్ మాట్లాడుతూ కార్లసన్ను ఎదురుక్కోవడం చాలా కష్టం.
100కు 99 సార్లు ఆ మ్యాచ్లో ఓడిపోయే అవకాశం ఉందని, కానీ లక్కీగా ఆ మ్యాచ్ను గెలిచినట్లు గుకేశ్ తెలిపాడు. 2024 డిసెంబర్ జరిగిన వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్లో చైనీస్ ప్లేయర్ డింగ్ లీరెపై గెలుపొందిన గుకేశ్ నార్వే గ్రాండ్ మాస్టర్స్ క్లాసికల్ టోర్నీలో గెలవడం ఇదే తొలిటిసారి. కాగా, కార్ల్సన్పై విజయం సాధించిన రెండో భారత గ్రాండ్ మాస్టర్గా గుకేశ్ నిలిచాడు. అంతకుముందు ప్రజ్ఞానంద చేతిలో కార్ల్సన్ ఓటమిని చవిచూశాడు.