
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేసిన లేటెస్ట్ పోస్ట్ నెటిజన్లను ఆలోచింపజేస్తుంది. అమెరికన్ సినిమా నటుడు, దర్శక, నిర్మాత క్లింటన్ ఈస్ట్వుడ్ జూనియర్కు సంబంధించి కంగనా ఓ పోస్ట్ పెట్టింది. వివరాల్లోకి వెళితే..
కంగనా సోమవారం (జూన్ 2న) తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో, అమెరికన్ సినిమా నటుడు, దర్శకడు క్లింటన్ ఫోటో షేర్ చేసింది. ఆయన పుట్టినరోజు సందర్భంగా నటి కంగనా రనౌత్.. ’95 ఏళ్ల వయసులో సినిమా తీసిన క్లింట్ ఈస్ట్వుడ్ను’ ప్రశంసించారు. అంతేకాకుండా అతనికి ‘యోగి’ అనే బిరుదును కూడా ఇస్తూ చిన్నపాటి నోట్ రాసింది. ఇందులో క్లింట్ ఈస్ట్వుడ్ కు 95 ఏళ్లు నిండడం.. ఈ వయసులో కూడా అతనో కొత్త మూవీని డైరెక్ట్ చేస్తుండటం గురించి మాట్లాడింది.
అలాగే చాలామంది నోట్ల.. ‘వినోద ప్రపంచం తరచుగా పనికిమాలినది మరియు వ్యర్థమైనదిగా భావించబడుతుంది. ఇది పూర్తిగా వాస్తవం కాదు. క్లింట్ ఈస్ట్వుడ్ వంటి వ్యక్తులు కళాకారులను చాలా మంచిగా చూపిస్తారు, ప్రతి ఉదయం 95 ఏళ్ల వయసులో కూడా మీకు ఒకే దృష్టి ఉంటుంది. అది సినిమా ఒక్కటే. ఒక సినిమా కోసం ‘నా ఫ్రేమ్ ఎక్కడ ఉందనే’ ఆలోచనలోనే క్లింటన్ ఉంటారు.. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు సినిమా యోగి’ అని తన ఫోటో పంచుకుంటూ క్లింటన్కు విషెష్ తెలిపింది కంగనా.
ఇటీవలే, క్లింట్ తన రాబోయే ప్రాజెక్ట్ వివరాలను పంచుకున్నాడు. అయితే, తాను త్వరలో సినిమాల నంచి రిటైర్డ్ అవుతానని వస్తోన్న వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చాడు. క్లింట్ డైరెక్ట్ చేయనున్న మూవీ ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్లో ఉందని తెలిపాడు. అలాగే రీమేక్లు, సీక్వెల్లు వంటి ట్రెండ్ను విమర్శించాడు.
ఇకపోతే కంగనా నటించి దర్శకత్వం వహించిన మూవీ ఎమర్జెన్సీ. 2025 జనవరి 17న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ వసూళ్లు సాధించలేకపోయింది. ప్రస్తుతం ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. 1975లో భారత మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ నాయకత్వంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా కంగనా ఈ సినిమాని తెరకెక్కించింది.