. < 1 minute

ఆర్మీ సమాచారం లీక్.. పంజాబ్ లో మరో పాక్ ISI ఏజెంట్ అరెస్ట్

Caption of Image.

ఆపరేషన్ సిందూర్ తర్వాత   భారత్ లో ఉంటూ పాకిస్తాన్ కు సహకరించిన వారిని అరెస్ట్ చేస్తోంది. పాకిస్థాన్ సీక్రెట్ సర్వీసెస్ ఏజెన్సీ (ఐఎస్ఐ) ఏజెంట్‎గా పని చేస్తోందన్న ఆరోపణలపై హర్యానాకు చెందిన ట్రావెల్ వ్లాగర్, యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను, రాంపూర్‌కు చెందిన ఒక వ్యాపారవేత్తను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా జూన్ 3న పంజాబ్ పోలీసులు మరో పాక్ ఏజెంట్ ను అరెస్ట్ చేశారు.

తార్న్ తరణ జిల్లాకు చెందిన  గగన్ దీప్ సింగ్ పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు గుర్తించారు. భారత ఆర్మీకి సంబంధించిన సమాచారాన్ని పాక్ కు చేరవేసినట్లు గుర్తించారు. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో ISIకు స్పైగా వ్యవహరించినట్లుగా గుర్తించారు పోలీసులు.  గగన్ దీప్ ఖలిస్థానీ ముసుగులో ISIకు సమాచారం చేరవేశారు. ఆపరేషన్ సింధూర్  సమయంలో సైనిక కదలికలకు సంబంధించిన సమాచారాన్ని లీక్ చేశారు. అలాగే గగన్‌దీప్ సింగ్ గత ఐదు సంవత్సరాలుగా పాకిస్తాన్‌కు చెందిన ఖలిస్తానీ మద్దతుదారు గోపాల్ సింగ్ చావ్లాతో సంప్రదింపులు జరుపుతున్నాడని, అతని ద్వారా  పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ (PIOs) కు పరిచయం అయ్యాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. 

►ALSO READ | ఆస్ట్రేలియా పోలీసుల దాష్టీకం.. కోమాలో భారతీయుడు, అసలేమైంది?

గగన్ దీప్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దేశానికి సంబంధించిన ,సైన్యానికి సంబంధించిన సమాచారాన్ని పాక్ కు లీక్ చేసినట్లు ఆధారాలు లభించాయి. అంతేగాకుండా 20 మందికి పైగా ఐఎస్ఐ ఏజెంట్లతో పరిచయాలు ఉన్నట్లు గుర్తించారు. జాతీయ భద్రతకు ముప్పు కల్గించినందున కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
 

©️ VIL Media Pvt Ltd.
Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.