
రామజన్మభూమి అయోధ్య ఆలయంలో రెండో దశ ప్రతిష్ఠాపనకు సంబంధించిన కార్యక్రమాలు మంగళవారం (జూన్ 3) ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో జూన్ 5 న రామ్ దర్బార్ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నారు. సరయూ నదీ తీరంలో సోమవారం ( జూన్ 2)న స్వామి వారి ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
రామజన్మభూమిలో రెండోదశ ప్రతిష్టాపన సందర్భంగా … అయోధ్యలో హైఅలర్ట్ ప్రకటాంచారు. ఆలయ ప్రాంగణాన్ని యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ATS)కమాండోలు ఆర్మీ వెహికల్స్తో గస్తీ చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా భారీగా భద్రతను ఏర్పాటు చేశారు.
రెండోదశ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా..రామ్ లల్లా ఆలయంలోని మొదటి అంతస్థులోని రామ్ దర్బార్ కాంప్లెక్స్ లో ఇతర దేవతా విగ్రహాలను ప్రతిష్టిస్తారు. ఈకార్యక్రమం జూన్ 5 గంగా దసరా ఉత్సవాలతో ముగుస్తాయని ఆలయ అధికారులు తెలిపారు.
ఆలయ మొదటి అంతస్తులోని రామ్ దర్బార్లో మరియు కాంప్లెక్స్ గోడలలోని ఆరు ఇతర దేవాలయాలలో విగ్రహాలను ప్రతిష్టించడం జరుగుతుంది. ప్రధాన వేడుకలు జూన్ 5న గంగా దసరా శుభ సందర్భంతో సమానంగా ముగుస్తాయి.
సోమవారం సాయంత్రం సరయు ఘాట్ నుంచి ప్రారంభమైన కలశ యాత్ర, వీణా చౌక్, రామ్ పాత్, సింగర్ హాత్ , రంగ్ మహల్, బారియర్ గుండా ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. జూన్ 3 , 4 తేదీలలో ఉదయం 6.30 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు … 1,975 మంత్రాల జపం, రామ రక్ష స్తోత్ర .. హనుమాన్ చాలీసా పారాయణం, ప్రత్యేక పూజలు.. హారతి .. తీర్ద ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. రాముడు, సీత, లక్ష్మణుడు , హనుమంతుడి విగ్రహాలతో పాటు మరో ఆరు దేవాలయాల ప్రతిష్టాపన కార్యక్రమం జూన్ 5న జరుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు.
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాలుగు కీలక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. వాటిలో ప్రధాన శంకుస్థాపన కార్యక్రమం, సరయు త్రయోదశి ఉత్సవ్, ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ జన్మదిన వేడుకలు .. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జరిగే కార్యక్రమాలకు సీఎం యోగి హాజరుకానున్నారు.
రామ్ లల్లా ఆలయం మొదటి అంతస్తులోని రామ్ దర్బార్ సమీపంలోని దేవాలయాలు ఇంకా నిర్మాణంలో ఉన్నాయని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ స్పష్టం చేశారు. రామమందిరం .. హనుమాన్గరి రెండింటిలోనూ సందర్శకుల కోసం ..నీడ ఉన్న వేచి ఉండే ప్రాంతాలు, తాగునీరు, పారిశుధ్యం ..ORS సాచెట్లతో సహా విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా మేజిస్ట్రేట్ నిఖిల్ తికారం ఫండే తెలిపారు.
అయోధ్యలో రెండో దశ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా భద్రతా పరంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుకుంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని..సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గౌరవ్ గ్రోవర్ తెలిపారు. ఆలయం లోపల.. చుట్టుపక్కలా యాంటీ టెర్రర్ స్క్వాడ్ (ATS) … స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) సిబ్బందితో భద్రతను కట్టుదిట్టం చేశారు.