
ధనాధన్ క్రికెట్ ఫైనల్ యుద్ధానికి వచ్చేసింది. ఐపీఎల్ 2025 కప్ కొట్టేది ఎవరు అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. 14 ఏళ్లుగా ఐపీఎల్ కప్ కోసం వెయిట్ చేస్తున్న కోహ్లీ సేన ఈసారి ఎలాగైనా విక్టరీ కొట్టాలనే కసితో ఉంది. ఫస్ట్ నుంచి బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో రాణిస్తున్న ఆర్సీబీ.. ఈసారి కప్ గెలవటం ఖాయం అనే ప్రిడిక్షన్స్ వస్తున్నాయి. ఈ సమయంలో పంజాబ్ కింగ్స్ ను తక్కువ అంచనా వేయలేం అని.. ఎలిమేటర్ రౌండ్ లో గెలిచి.. అనూహ్యంగా ఫైనల్ కు రావటం అంటే వాళ్లకు కూడా అదృష్టం ఉంది అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.
మ్యాచ్ బలాబలాలు ఎలా ఉన్నా.. ఇప్పుడు అందరి చూపు అహ్మదాబాద్ ఆకాశం వైపు ఉంది. నైరుతి రుతు పవనాల ప్రభావంతో ఇప్పటికే ఉత్తర భారతదేశం అంతా భారీ వర్షాలు పడుతున్నాయి. మొన్నటి మ్యాచ్ లోనూ వర్షం అంతరాయం ఏర్పడింది. ఫైనల్ మ్యాచ్ కు వర్షం పడుతుందా.. పడే ఛాన్స్ ఎంత ఉంది.. వాతావరణ శాఖ ఏం చెబుతుంది అనేది చూద్దాం..
2025, జూన్ 3వ తేదీ మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు వాతావరణ కూల్ గా ఉంది. ఉష్ణోగ్రత 30 డిగ్రీలుగా నమోదు అవుతుంది. అప్పుడప్పుడు చిరు జల్లులు పడుతున్నాయి. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్య వర్షం పడే ఛాన్స్ 49 శాతం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత 4 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య వర్షం పడే అవకాశం 51 శాతం ఉందని వెదర్ రిపోర్ట్ స్పష్టం చేస్తుంది.
ఇక ఫైనల్ మ్యాచ్ కోసం టాస్ వేసే సమయం రాత్రి 7 గంటలు. ఈ సమయానికి వర్షం పడే ఛాన్స్ 5 శాతం మాత్రమే ఉంది. ఆ తర్వాత నాలుగు గంటల వరకు.. అంటే రాత్రి 11 గంటల మధ్య వరకు 2 శాతం మాత్రమే వర్షం పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రిపోర్ట్ స్పష్టం చేస్తుంది.
సో.. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరిగే అహ్మదాబాద్ లో మ్యాచ్ సమయానికి వర్షం పడే అవకాశం అయితే లేదు. జస్ట్ 5 శాతం మాత్రమే అవకాశం ఉంది. సో.. మ్యాచ్ జరుగుతుంది.. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అంటుంది వెదర్ రిపోర్ట్.
లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. వర్షం రాకడ చెప్పటం కష్టమనే సామెత కూడా ఉంది. ఏ నిమిషానికి వాతావరణం ఎలా మారుతుందో కూడా ఊహించలేం. జూన్ 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటల సమయానికి ఉన్న వెదర్ రిపోర్ట్ మాత్రమే ఇది.. రాత్రికి ఏమైనా జరగొచ్చు కదా…