
కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్ లక్ష కోట్ల రూపాయలను వృథా చేశారని విమర్శించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. చెన్నూర్ మున్సిపాలిటీలో ప్రజల సౌకర్యార్థం రెండు బోర్లను మంజూర్ చేసిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. చెన్నూరు మున్సిపాలిటీలోని 6వ వార్డు, 12 వ వార్డులో కొత్తగా వేసిన రెండు బోర్లను ప్రారంభించారు చెన్నూర్ ఎమ్మేల్యే వివేక్ వెంకటస్వామి. తమ కాలనీలకు బోర్లు మంజూరు చేసిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ధన్యవాదాలు తెలిపారు కాలనీ వాసులు..అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చెన్నూర్ మండలానికి చెందిన అర్హులైన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ .
ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. కాళేశ్వరం పేరుతో వృథా చేసిన లక్ష కోట్లతో అందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు జరిగేవి. కానీ కేసీఆర్ తన కొడుకు,కూతురి కోసం 100 పడకల ఫాంహౌస్ కట్టించాడు. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీసిండు కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడం జరుగుతుంది. ఎలక్షన్ లలో ఇచ్చిన మాట ప్రకారంగా అన్ని అభివృద్ధి పనులు చేస్తుంది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, గ్యాస్ సబ్సిడీ, 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నాం.
నేను గెలిచిన తర్వాత అన్ని గ్రామాల్లో తిరిగి ఏమేం పనులు అవసరమో తెలుసుకున్నాం. ప్రతీ గ్రామంలో సుమారు 50 లక్షల నిధులతో అభివృధి పనులు జరుగుతున్నాయి. సోమన పల్లె గ్రామంలో 200 కోట్ల నిధులతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. నియోజకవర్గంలోని స్కూల్ మరమ్మత్తుల కోసం నిధులను కేటాయించి అభివృద్ధి చేస్తాము.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అన్ని స్కూళ్లలో ఉపాధ్యాయులను నియమించాం. ఎన్నికలప్పుడు చెప్పిన విధంగా 10 లక్షల ఆరోగ్య శ్రీ ఇస్తున్నాం. కరోనా సమయంలో గత ప్రభుత్వం వైద్యం పట్ల నిర్లక్ష్యం చేసింది. రూ. 900 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం. అర్హులు నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇండ్లను కట్టుకోవాలి అని వివేక్ అన్నారు.