. < 1 minute

Taekwando Player

కాన్పూర్: జాతీయస్థాయి తైక్వాండో (Taekwando Player) క్రీడాకారిణిపై(30) ఓ ఆశ్రమంలో సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాన్పూర్‌లోని గోవింద్ నగర్‌లో ఈ దుర్ఘటన జనవరిలో జరిగింది. బాధితురాలు పోలీసులకు చెప్పిన వివరాల ప్రకారం.. గోవింద్‌నగర్‌లోని ఓ ఫుట్‌పాత్‌పై బాధితురాలు ప్రతీ మంగళవారం పాత బట్టల వ్యాపారం చేసేది. ఈ క్రమంలో జనవరి 28వ తేదీన ఓ ఓ వృద్ధుడు ఆమె వద్దకు వచ్చి షాపు ఏర్పాటు చేసుకొనేందుకు నాలుగు వేల రూపాయిలు అడిగాడు. అంతేకాక.. ఆమెను దగ్గర్లోని ఆశ్రమంకి తీసుకువెళ్లి.. అక్కడి వారిని పరిచయం చేస్తానని.. దీంతో ఆమెకు షాపు ఏర్పాటు చేయడం సులభంగా మారుతుందని నమ్మించాడు.

అతని మాటలు నమ్మిన తైక్వాండో క్రీడాకారిణి (Taekwando Player).. ఆ వృద్ధుడితో కలిసి ఆశ్రమంకు వెళ్లింది. అక్కడ ఆమెకు మత్తుమందు కలిపిన లడ్డును తినిపించారు. ఆమె స్పృహ కోల్పోయాక.. ఆ వృద్ధుడితో పాటు.. అక్కడి ప్రధాన పూజారితో పాటు మరో ఇద్దరు ఆత్యాచారానికి ఒడిగట్టారు. అంతేకాక.. ఆ ఘటన మొత్తం రికార్డు చేశారు. ఆ తర్వాత యువతిని ఆ వీడియోని సోషల్‌మీడియాలో పెడతామని బెదిరించడం ప్రారంభించారు. వారి వేధింపులు భరించలేక యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సౌత్ ఎడిసిపి మహేశ్ కుమార్ ఈ ఘటన గురించి మాట్లాడుతూ.. ‘‘ఆ వీడియోని స్వాధీనం చేసుకున్నాం. ఆ వీడియోలో కనిపించిన ఆశ్రమం గదిని తనిఖీ చేశాం. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి.. ఈ ఘటనపై చర్యలు తీసుకుంటాం’’ అని అన్నారు. అయితే నిందితులు మాత్రం ఆ సమయంలో కుంభమేళలో ఉన్నామని పోలీసులకు తెలిపారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఆధారంగా చూపించారు.

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.