
టీడీపీకి చెందిన పెళ్లి బృందంపై వైసీపీ కార్యకర్తల దాడి..!
కర్నూలు జిల్లా కోసిగిలో జరిగిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కోసిగి 3వ వార్డు కాసేమ్మగడ్డ దగ్గర వైసీపీ ఎంపీపీ ఈరన్న అనుచరులు.. పెండేకంటి భాస్కర్ భార్య, కుమారులు పెండేకంటి ఆనందమ్మ, లోకారెడ్డి మరి కొందరు సుమారు 50 మందికి పైగా పెళ్లి ఉరేగింపుపై మూకుమ్మడిగా దాడి చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుచర్ల ఇంటిముందు వెళుతున్న టీడీపీ నాయకుడు పోతుల తాయన్న కుమారుడు పెళ్లి ఉరేగింపుపై మూకుమ్మడిగా దాడి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. మహిళల మెడలో ఉన్న బంగారం వెండి వస్తువులను వైసీపీ శ్రేణులు లాగేసుకున్నారని బాధితులు తెలిపారు. పోలీసులకు సమాచారం అందించండంతో ఘటనా స్థలానికి చేరుకొని వైసీపీ శ్రేణులను చదరగొట్టారు అనంతరం బాధితులు పోతుల నరసమ్మ తాయన్న ఫిర్యాదు మేరకు వైసీపీకి చెందిన 11 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు..
జగన్ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి..!
ప్రజలు చారిత్రక తీర్పునిచ్చన జూన్ 4వ తేదీని వైసీపీ నేతలు పశ్చాతాప దినంగా జరుపుకోవాలని సూచించారు మంత్రి అనగాని సత్యప్రసాద్.. సరిగ్గా ఏడాది క్రితం రాష్ర్టంలో రాక్షస పాలనకు ఎండ్ కార్డ్ పడిందన్న ఆయన.. ప్రజలను వేధించి వేయించుకు తిన్న సైకో నేతకు చాచి కొట్టినట్లు ప్రజలు బుద్ది చెప్పారని పేర్కొన్నారు.. ఐదేళ్ల పాటు ప్రజలకు చేసిన మోసానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిజానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని వ్యాఖ్యానించారు.. కానీ, వెన్నుపోటు దినం అంటూ వెర్రి కూతలు కూస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.. ప్రజలు చారిత్రక తీర్పునిచ్చన జూన్ 4వ తేదీని వైసీపీ నేతలు పశ్చాతాప దినంగా జరుపుకోవాలని సూచించిన ఆయన.. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకు జరుగుతున్న మేళ్లను చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు.. అందుకే అలవాటు ప్రకారం అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. కానీ, తల్లికి, చెల్లెల్లలకే వెన్నుపోటు పొడిచిన జగన్ను ప్రజలు నమ్మడం లేదన్నారు.. ఇదే వైఖరితో కొనసాగితే వైసీపీ పరిస్థితి గుండుసున్నాకు చేరుకుంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి అనగాని సత్యప్రసాద్..
గంజాయి బ్యాచ్పై చర్యలు తీసుకోవడం తప్పా జగన్..? ఏం సందేశం ఇస్తున్నారు..?
ప్రకాశం జిల్లా కొండేపిలో ఎస్సై రమేష్ బాబుపై వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి.. దళితుల పట్ల జగన్ మొసలి కన్నీరు కార్చుతున్నారు. గంజాయి బ్యాచ్ పై పోలీసులు చర్యలు తీసుకోవడం తప్పా జగన్ ? అని నిలదీశారు.. నేరస్తులను ప్రోత్సహించి జగన్ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు ? అని ఎద్దేవా చేశారు.. రౌడీలకు, గూండాలకు కులాలు అంటగట్టి రాజకీయం చేస్తారా ?, వైసీపీ పాలనలో దళితులపై హత్యలు, అత్యాచారాలు జరిగితే జగన్ ఎందుకు నోరు మెదపలేదు?, దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను చంపి డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీపై జగన్ ఏం చర్యలు తీసుకున్నారు ?, కనీసం సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యుల్ని జగన్ పరామర్శించారా?, మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ ని చంపిన పాపం మీది కాదా ?, జగన్ సొంత నియోజకవర్గంలో అత్యాచారానికి గురైన దళిత మహిళ నాగమ్మ కుటుంబాన్ని జగన్ ఎందుకు పరామర్శించలేదు? అంటూ నిలదీశారు..
కన్నీరు పెట్టుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.. కారణం ఏంటంటే?
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. పక్కనే ఉన్న మహిళలు ఊరుకో అక్కా అంటూ ఓదార్చారు. ఇంతకీ ఈ యువ ఎమ్మెల్యేకి ఏం కష్టమొచ్చింది. కన్నీరు పెట్టడానికి గల కారణం ఏమయ్యుంటుందబ్బా అని ఆలోచిస్తున్నారా? ఇంతకీ ఏం జరిగిందంటే.. మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం రైతు వేదికలో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో యశస్విని రెడ్డి పాల్గొన్నది. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేసే సమయంలో భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో తన చేతుల మీదుగా అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు అందజేయడం పట్ల బాగోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకుంది ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. ఆ సమయంలో పక్కనే ఉన్న మహిళలు ఊరుకో అక్కా అంటూ ఓదార్చారు. పేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. ఈ పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేసి నిధులను మంజూరు చేస్తోంది.
జూన్ 6న జమ్మూకాశ్మీర్లో మోడీ పర్యటన
ప్రధాని మోడీ జూన్ 6న జమ్మూకాశ్మీర్లో పర్యటించనున్నారు. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత తొలిసారి మోడీ జమ్మూకాశ్మీర్లో పర్యటిస్తున్నారు. శ్రీనగర్కు వందేభారత్ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. వాస్తవానికి ఏప్రిల్ 19నే ఈ కార్యక్రమం జరగాల్సి ఉంది. కానీ అప్పుడు వాతావరణం అనుకూలించకపోవడంతో వాయిదా పడింది. ఇంతలో మూడు రోజులు వ్యవధిలో ఏప్రిల్ 22న పహల్గామ్లో ఉగ్రదాడి జరిగింది. అనంతరం భారత్.. ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. జూన్ 6న చినాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి పనులకు ప్రధాని శ్రీకారం చుట్టనున్నారు. అలాగే శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా రైల్వే స్టేషన్ నుంచి శ్రీనగర్ వరకు వందే భారత్ ప్రత్యేక కాశ్మీర్ ఎడిషన్ను జెండా ఊపి ప్రారంభించనున్నారు. అంతేకాకుండా ఈ వేదికగా ఉగ్రవాదం అణిచివేతపై ప్రధాని మోడీ కీలక సందేశం ఇచ్చే అవకాశం ఉంది. ఇక మోడీ పర్యటన కోసం భద్రతా అధికారులు భద్రతను కట్టుదిట్టం చేయనున్నారు.
ఆపరేషన్ సిందూర్పై ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు ‘నో’ చెప్పిన కేంద్రం.!
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత్ ఆపరేషన్ సిందూర్తో పాకిస్తాన్కి సమాధానం ఇచ్చింది. అయితే, దీనిపై ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే, ఈ డిమాండ్ని ప్రభుత్వ పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తోంది. జూలైలో వర్షాకాల సమావేశాలు జరుగుతాయి కాబట్టి, ప్రస్తుతం ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడం సమర్థనీయం కాదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే, ఆపరేషన్ సిందూర్ గురించి ప్రతిపక్షాలకు అన్ని వివరాలు తెలియజేసినట్లు కేంద్రం చెబుతోంది. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయకులను ఉగ్రవాదులు పొట్టనబెట్టుచున్నారు. ఈ దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు నిర్వహించింది. 9 ఉగ్రస్థావరాలను నేటమట్టం చేసి 100కు పైగా ఉగ్రవాదుల్ని హతమార్చింది. ఆ తర్వాత, పాక్ కవ్వింపులకు ప్రతీకారంగా ఆ దేశానికి చెందిన 11 వైమానిక స్థావరాలపై భారత్ దాడులు చేసింది.
మేనల్లుడిని చంపిన అత్త.. అసలు కథేంటంటే..!
పశ్చిమ బెంగాల్లో దారుణం జరిగింది. ఒక మహిళ.. తన మేనల్లుడిని ముక్కలు.. ముక్కలుగా నరికి.. అవశేషాలను సిమెంట్ గోడలో వేసి కప్పేసింది. బాధితుడి జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు రావడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్లోని మాల్డా జిల్లాకు చెందిన మౌమిత అనే మహిళ తన మేనల్లుడు సద్దాం నాదాబ్తో సంబంధం కొనసాగిస్తోంది. మే 18 నుంచి సద్దాం జాడ కనిపించకుండా పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి మౌమితను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించింది. సద్దాంను చంపేసి.. శరీరాన్ని మూడు ముక్కలుగా చేసి తన తండ్రి ఇంట్లో సిమెంట్లో వేసి మూసేసినట్లు తెలిపింది. పోలీసులు.. దినాజ్పూర్ జిల్లాలోని తపన్ ప్రాంతంలోని ఇంటి నుంచి ప్లాస్టిక్ మరియు కాంక్రీటుతో చుట్టబడిన సద్దాం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పసిడి ధర పరుగులు.. నేడు మరింత పైపైకి
పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. రోజు రోజుకు మరింతపైకి ఎగబాకుతున్నాయి. నేడు తులంపై రూ. 200 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,906, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,080 వద్ద ట్రేడ్ అవుతోంది. గోల్డ్ ధరలతో పాటు వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 200 పెరిగింది. దీంతో రూ. 90,800 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 220 పెరిగింది. దీంతో రూ. 99,060 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 200 పెరిగింది. దీంతో రూ. 90,950 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 70 పెరిగింది. దీంతో రూ. 99,060 వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారం ధరలు పరుగులు పెడుతుండగా వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. నేడు కిలో వెండిపై రూ. 100 పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,11,100 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,00,100 వద్ద ట్రేడ్ అవుతోంది.
నంబర్ 18 జెర్సీ.. ఆందోళనలో ఆర్సీబీ ఫ్యాన్స్!
రెండు నెలలుగా అభిమానుల్ని ఉర్రుతలూగిస్తున్న ఐపీఎల్ 2025 ఈ రోజుతో ముగుస్తుంది. టైటిల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. ఇరు జట్లు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ గెలవలేదు. ఈ నేపథ్యంలో ఎవరు గెలిచినా ఆ జట్టు పదిహేడేళ్ల కల నెరవేరుతుంది. అయితే ఆర్సీబీనే గెలవాలని కోట్లాది మంది అభిమానులు కోరుకుంటున్నారు. శ్రేయాస్ అయ్యర్ పంజాబ్కి తొలిసారి ఆడుతున్నాడు. కోహ్లీ పదిహేడేళ్లుగా ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దీంతో ఆర్సీబీ గెలిస్తే చూడాలని ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అభిమానులతోతో పాటు సీనియర్ ఆటగాళ్లు, క్రికెట్ విశ్లేషకులు కూడా ఆర్సీబీ కప్ గెలవాలని కోరుకుంటున్నారు. ఆర్సీబీ గెలుపుపై ఎవరి లెక్కలు వాళ్లకున్నాయి. కోహ్లీ జెర్సీ నంబర్తో ఈ రోజు డేట్, నెల, సంవత్సరంతో పోల్చి చూస్తున్నారు. కోహ్లీ జెర్సీ నంబర్ 18 కాబట్టి.. జూన్ మూడు ప్లస్, ఆరో నెల ప్లస్, 2025 కలిపితే మొత్తం నంబర్ 18 అవుతుంది. దీంతో కాలం కూడా కోహ్లీ టైటిల్ గెలవాలని నిర్ణయించిందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇది ట్రెండ్ అవుతుంది.
అందరి టార్గెట్ ఒక్కడే..
ఐపీఎల్ ఫైనల్……. ఇంకా కొన్ని గంటల్లో ఛాంపియన్ ఎవరో తేలిపోతుంది. మొదటి క్వాలిఫయర్ లో గెలిచి ఆర్సీబీ ఫైనల్ ల్లో అడుగుపెట్టింది. ఆర్సీబీ చేతిలో ఓడిన పంజాబ్ ముంబైపై ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచి ఫైనల్ కు చేరింది. ఈ విజయంలో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ దే కీలక పాత్ర. మ్యాచ్ ఓటమి అంచున ఉండగా, అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ధనాధన్ బ్యాటింగ్ తో ముంబైకి చుక్కలు చూపించాడు. దాదాపు పదకొండు సంవత్సరాల తర్వాత అయ్యర్ సారధ్యంలో పంజాబ్ టైటిల్ రేసులో నిలిచింది. ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ రెండోసారి టైటిల్ మ్యాచ్ లో పాల్గొంటుంది. ఆర్సీబీ నాలుగోసారి ఫైనల్ కి చేరింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కొత్త ఐపీఎల్ ఛాంపియన్ ని చూడబోతున్నాం. ఈ మ్యాచ్ లో అందరి దృష్టి విరాట్ కోహ్లీపైనే ఉంది. విరాట్ కొద్దిసేపు క్రీజులో ఉంటే పంజాబ్ బౌలర్లు అతనిని అవుట్ చేయడం అంత ఈజీ కాదు. కోహ్లీ క్రీజులో కుదురుకున్నాక అతడిని అవుట్ చేయాలంటే పంజాబ్ బౌలర్లకు తలకుమించిన భారంగా మారుతుంది. మాజీ క్రికెటర్, యువరాజ్ సింగ్ ఫాదర్ యోగరాజ్ కింగ్ కూడా ఇదే విషయాన్నీ చెప్తున్నాడు.
ఆర్సీబీకి బిగ్ షాక్.. ఐపీఎల్ ఫైనల్కు మ్యాచ్ విన్నర్ దూరం!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ఫైనల్ మ్యాచ్ మంగళవారం (జూన్ 3) రాత్రి 7.30కు ఆరంభం కానుంది. మరికొన్ని గంటల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ఫైనల్స్లో తలపడనున్నాయి. క్వాలిఫయర్-1లో పంజాబ్పై అద్భుత విజయంతో నేరుగా ఫైనల్ చేరిన బెంగళూరు.. ఐపీఎల్ ట్రోఫీ కలను నెరవేర్చుకునేందుకు సిద్ధమైంది. అయితే ఫైనల్కు ముందు ఆర్సీబీకి భారీ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. ఆర్సీబీ బిగ్ మ్యాచ్ విన్నర్, విధ్వంసకర ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఫైనల్ మ్యాచ్లో ఆడడం లేదని సమాచారం. ఐపీఎల్ 2025 ఫైనల్ కోసం ఆర్సీబీ సోమవారం ముమ్మరంగా ప్రాక్టీస్ చేసింది. ఈ ప్రాక్టీస్ సెషన్లో ఫిల్ సాల్ట్ కనిపించలేదని కొన్ని జాతీయ మీడియాలు తమ కథనంలో రాసుకొచ్చాయి. సాల్ట్ ప్రాక్టీస్ సెషన్కు ఎందుకు హాజరు కాలేదో ఇంకా తెలియరాలేదదు. అయితే సాల్ట్ సతీమణి మొదటి బిడ్డకు జన్మనివ్వనుందని, ఈ సమయంలో ఆమె చెంత ఉండేందుకు ఇంగ్లాండ్ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కోచ్ ఆండీ ఫ్లవర్, కెప్టెన్ రజత్ పాటిదార్కు విషయం చెప్పి వెళ్ళాడట. ఈ విషయాన్ని ఆర్సీబీ యాజమాన్యం గోప్యంగా ఉంచినట్లు సమాచారం. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే.. టాస్ వరకు ఆగాల్సిందే. సాల్ట్ అందుబాటులో లేకపోతే.. టిమ్ సీఫర్ట్ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది.
సీఎం చంద్రబాబుతో అక్కినేని నాగార్జున భేటీ.. విషయం ఏంటంటే?
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు సినీ హీరో అక్కినేని నాగార్జున.. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన నాగార్జున.. ఆయనతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.. తన చిన్నకుమారుడు అక్కినేని అఖిల్ వివాహ ఆహ్వానపత్రికను సీఎం చంద్రబాబుకు అందజేసిన నాగార్జున.. తన కుమారుడి పెళ్లి రావాలంటూ ఆహ్వానించారు.. కాగా, గతేడాది అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య – శోభితా వివాహ బంధంలోకి అడుగుపెట్టగా.. ఇప్పుడు ఆయన చిన్న కుమారుడు అఖిల్ కూడా పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు.. ఇప్పటికే ప్రముఖ బిజినెస్మెన్ జుల్ఫీ రవ్డ్జీ కుమార్తె జైనబ్తో గతేడాది నవంబర్ 26వ తేదీన అక్కినేని అఖిల్ నిశ్చితార్థం చేశారు.. ఇక, ఈ నెల 6వ తేదీన అక్కినేని అఖిల్ – జైనబ్ వివాహం నిర్వహించబోతున్నారు.. జైనబ్ హైదరాబాద్కు చెందిన అమ్మాయి.. కొన్ని ఏళ్లుగా అఖిల్తో ప్రేమలో ఉన్నారు.. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులను కలిసి అక్కినేని నాగార్జున ఆహ్వానించిన విషయం విదితమే.. ఇక, హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో అఖిల్ – జైనబ్ వివాహం జరగనున్నట్టుగా తెలుస్తుండగా.. ఆ తర్వాత రాజస్థాన్లో గ్రాండ్గా రిసెప్షన్ ప్లాన్ చేశారని సమాచారం..
‘‘మీరేమైనా చరిత్రకారులా..?’’ కన్నడ వ్యాఖ్యలపై కమల్ హసన్ని మందలించిన కోర్టు..
యాక్టర్ కమల్ హాసన్ని కర్ణాటక హైకోర్టు తీవ్రంగా మందలించింది. ఇటీవల, ఆయన కొత్త చిత్రం ‘థగ్ లైఫ్’ ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘‘కన్నడ తమిళం నుంచి పుట్టింది’’ అని వ్యాఖ్యలు చేశాడు. అయితే, దీనిపై కర్ణాటకలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. తమ భాషను తక్కువ చేసి మాట్లాడారని, క్షమాపణలు చెప్పాలని, లేకపోతే ఆయన సినిమా కర్ణాటక లో విడుదల కాకుండా అడ్డుకుంటామని కన్నడిగులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తన సినిమా రిలీజ్ అయ్యేందుకు, ఎలాంటి అడ్డంకులు సృష్టించకుండా ఉండేలా అధికారుల్ని ఆదేశించాలని కమల్ హాసన్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఈ ప్రకటన ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని పేర్కొంటూ, కమల్ హాసన్ క్షమాపణ చెప్పడానికి నిరాకరించడాన్ని జస్టిస్ ఎం నాగప్రసన్న ప్రశ్నించారు. “ఏ పౌరుడి మనోభావాలను దెబ్బతీసే హక్కు లేదు” అని న్యాయమూర్తి అన్నారు. ‘‘నీరు, భూమి, భాష పౌరులకు ముఖ్యమైనవి, భాషాపరమైన అంశాలపై దేశంలో విభజన జరిగింది’’ అని అన్నారు.