. 2 minutes

పాక్ జైలు నుంచి 200 మంది ఖైదీలు పరార్.. దర్జాగా రోడ్లపై విహారం..

Caption of Image.

Pakistan Jailbreak: ఇటీవల ఇండియా చేసిన ఆపరేషన్ సిందూర్ దాడుల్లో తీవ్ర పరాభవం పొందిన పాక్.. అంతర్గతంగా కూడా సెక్యూరిటీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని తెలుస్తోంది. తాజాగా పాకిస్థాన్ జైలు నుంచి 200 మందికి పైగా ఖైదీలు తప్పించుకుపోవటం ప్రపంచ వ్యాప్తంగా ఆ దేశాన్ని నవ్వులపాటు చేస్తోంది.

వివరాల్లోకి వెళితే.. కరాచీలోని హైసెక్యూరిటీ కలిగిన మలిర్ జైలు నుంచి సోమవారం రాత్రి సమయంలో 200 మంది ఖైదీలు ఒకేసారి ఎస్కేప్ అయ్యారు. అయితే నగరం సమీపంలో భూకంపం వచ్చిన సమయంలో ఇది జరిగింది. పాక్ అధికారుల సమాచారం ప్రకారం ఈ సమయంలో 216 మంది తప్పించుకోగా.. తొక్కిసలాటలో ఒక ఖైదీ మరణించాడు. పైగా చాలా మంది ఆ సమయంలో పాక్ పోలీసులు జరిపిన కాల్పుల్లో గాయాలపాలయ్యారని వెల్లడైంది. అలాగే జైలు గార్డుతో పాటు అక్కడి అధికారులు ముగ్గురు గాయపడ్డారు. దీంతో ఖరాచీని హైఅలర్ట్ చేశారు అక్కడి అధికారులు.

 

వాస్తవానికి నగరంలో భూ ప్రకంపనలు రావటంతో అధికారులు జైలులోని ఖైదీలను ముందస్తు జాగ్రత్తలో భాగంగా వారి బ్యారెక్స్ నుంచి ఒక ఖాళీ ప్రదేశానికి పంపించారు. ఆ సమయంలో ఒకే చోట దాదాపు 700 నుంచి వెయ్యి మంది ఖైదీలు మెయిన్ గేటు సమీపంలోకి వచ్చి చేరారు. ఆ సమయంలో దాదాపు 100 మంది కరుడుగట్టిన నేరస్తులు జైలు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించటంతో పాటు గేట్లు తెరవాలని అక్కడి సిబ్బందిపై దాడి చేశారు. అలాగే పహారాలో ఉన్న జైలు అధికారుల వద్ద నుంచి తుపాకులు లాక్కొని కాల్పులు జరిపారు. దీంతో సెక్యూరిటీ బ్రీచ్ ఏర్పడింది. 

ఈ ఘటనలో నేరస్తులు దర్జాగా జైలు మెయిన్ డోరు నుంచే తప్పించుకున్నట్లు తేలింది. ఇలాంటి అత్యవసర సమయాల్లో ఎలా వ్యవహరించాలనే ప్లానింగ్, దానికి తగిన ఏర్పాట్లు లేకపోవటమే నేరస్తులు తప్పించుకోవటానికి కారణంగా ఉందని వెల్లడైంది. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి. సదరు వీడియోల్లో తాము 28 ఏళ్ల నుంచి జైలులో ఉన్నామంటూ ఖరాచీ రోడ్లపై అరస్తున్న నేరస్తులకు సంబంధించిన చిత్రాలు కనిపించాయి. ప్రస్తుతం వీరిని తిరిగి పట్టుకునేందుకు సెర్చ్ కొనసాగుతుండగా ఇప్పటికే 75 మంది వరకు దొరికారని అక్కడి మీడియా కథనాల ప్రకారం తెలుస్తోంది. దీనిపై ఉన్నతస్థాయి దర్యాప్తును స్టార్ట్ చేశారు. ఎవరి నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందో కనుక్కునే పనిలో పాక్ ప్రభుత్వం ఉంది. 

 

జైలు నుంచి భారీగా ఖైదీలు తప్పించుకోవటంతో పాక్ పోలీసులు, స్పెషల్ సెక్యూరిటీ యూనిట్, ర్యాపిడ్ రెస్పాన్స్ ఫోర్స్ రంగంలోకి దిగి జైలులో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చారు. అయితే పోలీసులకు తిరిగి చిక్కిన ఖైదీని ప్రశ్నించగా భూకంపం వచ్చిందని పరిగెత్తాలని అక్కడి వారు అరవటంతో తాము కూడా భయపడి పారిపోయినట్లు పేర్కొన్నాడు. 

©️ VIL Media Pvt Ltd.
Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.