
ప్రతి రైతుకు ఒక భూధార్ నెంబర్ ఇస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఖమ్మంలో భూ భారతి రెవెన్యూ సదస్సులో మాట్లాడిన ఆయన..ఈ రోజు నుంచి అధికారులే ప్రతి రెవెన్యూ విలేజ్ లో మీ ఇంటికి వచ్చి సర్వే చేస్తారని చెప్పారు. రైతులు ఏ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి రైతు కు ఒక్క భూధార్ నెంబర్.. లైసెన్స్డ్ సర్వేయర్ లను ఇస్తాం. అలాగే ప్రతి రెవెన్యూ విలేజ్ కి ఒక్క విఆర్ఓను ఇస్తామని చెప్పారు. త్వరలోనే 3,556 మంది నియామకం జరగనుందన్నారు. భూములకు రెవెన్యూ అధికారి కాపలా దారుడిగా ఉంటారని చెప్పారు.
దేశానికి మాణిక్యం వంటి చట్టం భూ భారతి. దేశ వ్యాప్తంగా సర్వే చేసి ఈ పథకం తీసుకొచ్చాం. ఒక్క చట్టం అమలు చేసేటప్పుడు ముందుగా దాని విశ్లేషణ కోసం నాలుగు మండలాలు పైలెట్ ప్రాజెక్ట్ గా తీసుకున్నాం. దేశానికి ఆగస్టు 15 న స్వాతంత్రం వచ్చిన విధంగానే వచ్చే ఆగస్టు నాటికి ధరణి నుంచి విముక్తి కల్పిస్తాం. మీ సమస్యలు అన్ని పరిష్కారం అవుతాయి . రాష్ట్రంలో 413 రెవెన్యూ గ్రామాల్లో నక్షలు లేవు. అయిదు గ్రామాలను పైలెట్ ప్రాజెక్ట్ లుగా అయిదు సంస్థలకు ఇచ్చాం. గత ప్రభుత్వంలో మాదిరిగా ఒక్కరికే ఇవ్వలేదు. ములుగుమాడుకు ఒక్క నక్ష తయారు చేసి ఇస్తాం.
రాష్ట్ర వ్యాప్తంగా భూమి లేకుండా ఉన్నట్లుగా చిత్రికరించారు గత ప్రభుత్వం నేతలు. రైతు బందు కోసం పెద్దల సహకారంతో అక్రమాలు చేశారు. ధరణి పేరుతో అక్రమంగా ఆనాడు ఇందిరమ్మ పేరుతో పేదలకు ఇచ్చిన భూములను తారు మారు చేశారు. భూభారతి రిజిస్ట్రేషన్ వ్యవస్థలో కూడా మార్పులు చేస్తున్నాం. స్లాట్ బుకింగ్ పెట్టి పారదర్కగా చేస్తున్నాం. గత ప్రభుత్వం చేపట్టిన అన్ని సంక్షేమ పథకాలు ఇస్తూ కొత్త పథకాలు ఇస్తున్నామని చెప్పారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.