
హైదరాబాద్లో ఐపీఎల్ ఫైనల్ ఫీవర్ పీక్స్కు చేరింది. ఐపీఎల్ లైవ్ టెలికాస్ట్ ఇస్తున్న మల్టీప్లెక్స్ థియేటర్లలో సీట్లు నూటికి 99 శాతం బుక్ అయిపోయాయి. హైదరాబాద్లోని పీవీఆర్ ఐనాక్స్ థియేటర్లలో ఐపీఎల్ మ్యాచులను ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ ఫైనల్ లైవ్ మ్యాచ్.. ప్రదర్శితం కానున్న పంజాగుట్ట పీవీఆర్ సెంట్రల్ మాల్లో 7:15, 7:30 టైంకి ఐపీఎల్ లైవ్ స్పెషల్ స్క్రీనింగ్ ఉండగా.. ఈ రెండు టైం స్లాట్స్లో టికెట్లన్నీ బుక్ అయిపోయాయి. బుక్ మై షోలోకి వెళ్లి చూస్తే ఈ విషయం తెలిసిపోతుంది.
పీవీఆర్ ఇర్రుమంజిల్, పీవీఆర్ నెక్సస్ మాల్ కూకట్ పల్లి, జీఎస్ఎం మాల్, పంజాగుట్ట నెక్ట్స్ గెలెరియా మాల్, కవాడిగూడ ఐనాక్స్, గచ్చిబౌలి పీవీఆర్, కూకట్ పల్లి వై జంక్షన్ అశోక వన్ మాల్, పీవీఆర్ ప్రిస్టన్ గచ్చిబౌలి, పీవీఆర్ ఐకాన్ మాదాపూర్, పీవీఆర్ మూసారాం బాగ్, ప్రిజం మాల్ ఐనాక్స్, పీవీఆర్ ఆర్కే సినీప్లెక్స్ మల్టీప్లెక్స్ స్క్రీన్లపై ఐపీఎల్ లైవ్ మ్యాచులు వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు టికెట్లు బుక్ చేసుకున్నారు. ఈ ఐపీఎల్ లైవ్ మ్యాచ్ షోస్ అన్నీ బుక్ అయిపోయాయంటేనే హైదరాబాద్లో ఐపీఎల్ ఫైనల్ బజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగే టైటిల్ ఫైట్లో ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనున్న సంగతి తెలిసిందే. ఇందులో నెగ్గి తొలిసారి ఐపీఎల్ చాంపియన్గా నిలవాలని ఇరు జట్లూ తహతహలాడుతున్నాయి. ఈ పోరులో ఆర్సీబీ సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ, పంజాబ్ లీడర్ శ్రేయస్ అయ్యర్పై అందరి ఫోకస్ ఉండనుంది. నాలుగో సారి ఫైనల్ ఆడుతున్న కోహ్లీకి సపోర్ట్గా వేలాది మంది ఫ్యాన్స్ నం.18 జెర్సీలతో స్టేడియానికి పోటెత్తే అవకాశం ఉంది. ఇంకోవైపు మూడు జట్లను ఫైనల్ చేర్చిన (ఢిల్లీ, కేకేఆర్, పంజాబ్) కెప్టెన్గా అరుదైన రికార్డు సృష్టించిన అయ్యర్ వరుసగా రెండోసారి ట్రోఫీని ముద్దాడాలని కోరుకుంటున్నాడు. ముంబై ఇండియన్స్ లాంటి జట్టును ఇంటికి పంపించేసి పంజాబ్ కింగ్స్ ఫైనల్కు అర్హత సాధించడంతో PBKS జట్టుపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి.