పాకిస్థాన్లోని బఛా జైలు పరిసర ప్రాంతంలో భూకంపం రావడంతో 200లకు పైగా ఖైదీలు (Prisoners Escaped) తప్పించుకున్నారు. సోమవారం ఇక్కడ మూడుసార్లు భూమి కంపించింది. దీంతో జైలులోని కొన్ని గోడలకు పగుళ్లు రాగా.. కొన్ని కూలిపోయాయి. ఈ క్రమంలో 600 నుంచి వెయ్యి మంది ఖైదీలను బ్యారక్ల నుంచి వేరే ప్రాంతానికి అధికారులు తరలిస్తుండగా.. ఖైదీలు తప్పించుకున్నారు(Prisoners Escaped). పలువురు అధికారుల వద్ద ఉన్న తుపాకులు తీసుకొని కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక ఖైదీ మృతి చెందగా.. నలుగురు అధికారులు గాయపడ్డారు.
ఖైదీల పరారీతో అప్రమత్తమైన అధికారులు తిరిగి ఖైదీలను పట్టుకొనేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకూ 80 మందిని పట్టుకున్నామని.. అందుకు స్థానికుల సహాయం తీసుకున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఈ జైలులో ఎక్కువ శాతం మాదకద్రవ్యాల సంబంధిత కేసుల్లోని నేరస్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారని మరో అధికారి తెలిపారు. పారిపోయిన వారిలో డ్రగ్స్ నేరస్థులు, మానసికంగా సరిగా లేని వారే అని ఎక్కవు ఉన్నారన్నారు.