ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ తుదపోరుకు రంగం సిద్ధమైంది. బుధవారం జరిగే ఫైనల్ మ్యాచ్లో సమవుజ్జీలు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్ తలపడునున్నాయ. 18 సీజన్లుగా ఈ రెండు జట్లుఒకసారి కూడా టైటల్ని గెలవలేదు. దీంతో ఈ సీజన్లో కొత్త ఛాంపియన్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ మ్యాచ్కి ముందు ఆర్సిబికి ఊహించని షాక్ తగిలింది. జట్టు కీలక ఆటగాడు ఫైనల్ మ్యాచ్లో ఆడే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఆర్సిబి ఆటగాడు టిమ్ డేవిడ్కు(Tim David) గాయమైంది.
దీంతో ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచ్లకు అతను దూరమయ్యాడు. అయితే ఫైనల్స్ సమయానికి టిమ్ డేవిడ్ కోలుకుంటాడని ఆర్సిబి యాజమాన్యం భావించింది. కానీ, అతను ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదని తెలుస్తోంది. ఈ విషయం గురించి ఆర్సిబి కెప్టెన్ రజత్ పాటిదార్ మాట్లాడుతూ.. ‘‘టిమ్ డేవిడ్ గాయం తీవ్రతపై ఎలాంటి అప్డేట్ రాలేదు. ప్రస్తుతం అతను మా వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. సాయంత్రం లోపు నాకు క్లారిటీ వస్తుంది’’ అని అన్నాడు.