. 2 minutes

IPL 2025 Final: ఐపీఎల్ యుద్ధానికి బెట్టింగ్ మానియా.. వరల్డ్ వైడ్ వేల కోట్ల బిజినెస్

Caption of Image.

యుద్ధం ఎలా ఉంటుంది.. వార్ ఎలా ఉంటుంది.. ఆ యుద్ధం కూడా 22 మంది.. ఓ గ్రౌండ్‎లో దిగి బ్యాట్, బాల్‎తో కొట్టుకుంటే ఎలా ఉంటుంది.. గెలుపు నీదా నాదా అన్నట్లు పోరాడుతుంటే ఎలా ఉంటుంది.. ఇద్దరు సమ ఉజ్జీలు హోరాహోరీగా పోరాడుతుంటే ఎలా ఉంటుంది.. వాళ్లకు ఏమోగానీ.. 140 కోట్ల మందికి నరాల తెగుతాయి.. బాల్ బాల్‎కు టెన్షన్ పెరుగుతుంది.. అలాంటి హైఓల్టేజ్ మ్యాచే ఐపీఎల్ 2005 ఫైనల్.. మరి ఇలాంటి మ్యాచ్ జరుగుతుంది.. కుర్రోళ్లు ఊరికే ఉంటారా.. ఎవరికి వాళ్లు మ్యాచ్ ప్రిడిక్షన్స్ చెప్పేస్తారు.. 

బెట్టింగ్స్ కాసేస్తారు.. వస్తే వెయ్యి మామా.. పోతే వందే మామా.. వస్తే లక్ష మామా.. పోతే 10 వేలు మామా అన్నట్లు బెట్టింగ్స్ ఊపు మొదలైపోయింది. గుజరాత్‎లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా 2025, జూన్, 3 రాత్రి 7.30 గంటలకు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. పంజాజ్ కింగ్స్, ఆర్సీబీ తొలి ఐపీఎల్ టైటిల్ కోసం పోటీ పడుతున్నాయి. ఆర్సీబీ, పంజాబ్ టీముల మధ్య జరగనున్న ఈ హైవోల్టేజ్ మ్యాచ్‎పై కోట్లలో బెట్టింగ్స్ జరుగుతున్నాయి. ఆఫ్ లైన్, ఆన్ లైన్ ఇలా వేల కోట్లు చేతులు మారుతున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఎక్కడ చూసిన ఇదే టాపిక్. 

సినిమా, పొలిటికల్, స్పోర్ట్స్ అని ఇలా ఏ రంగంలో చూసిన దీనిపైనే చర్చ. ఏ టీమ్ కప్ గెలుుస్తుంది..? ఏ జట్టు కొత్త ఛాంపియన్‎గా అవతరిస్తుంది..? అని డిస్కషన్స్. దీనిపై బెట్టింగ్స్. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో దేశంలోని మెట్రో నగరాలు పుల్ రష్‎గా మారిపోయాయి. స్టార్ హోటల్స్, రెస్టారెంట్స్, బార్స్ ముందు హాస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి. ఆఫ్ లైన్, ఆన్ లైన్ వేదికగా కోట్ల రూపాయిల బెట్టింగ్ జరుగుతోంది. పందెం రాయుళ్లు జోరు మీద ఉండటంతో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. మెట్రో నగరాలపై నజర్ పెట్టారు.

ఆన్ లైన్ బెట్టింగ్ యాప్‎లపై నిఘా ఉంచారు. మొత్తానికి ఇవాళ దేశవ్యాప్తంగా ఐపీఎల్ ఫైనల్ మానియా నడుస్తోంది. వేల కోట్లకు చేరింది ఐపీఎల్ ఫైనల్ మానియా. ఆర్సీబీ ఫైనల్‎కు చేరటం.. ఫస్ట్ టైం కప్ కొడుతుందా లేదా అనే దానిపై జోరగా చర్చ నడుస్తోంది. ఇప్పటి వరకు 17 ఐపీఎల్ సీజన్లలో ఒక్క సారి కూడా కప్ కొట్టని కోహ్లీ.. అతడి  కల ఈసారైనా నేరవేరుతుందా అని డిస్కషన్. ఈసారి కప్ పటిదార్ సేనదే అంటూ సోషల్ మీడియాలో జోరుగా ట్రోలింగ్ జరుగుతోంది. హాట్ ఫేవరెట్ కావడంతో ఆర్సీబీపై ఆరు కోట్ల బెట్టింగ్ పెట్టినట్లు ఎక్స్‎లో హాలీవుడ్ సింగర్ డ్రేక్ రాయల్ ప్రకటన. 

హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఐపీఎల్ ఫైనల్ మానియా.. బెట్టింగ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. బెట్టింగ్స్ యాప్స్‎లో ఇప్పటికే వందల కోట్లు పెట్టిన  సమచారం. ఆర్సీబీ పైనే కాకుండా.. పంజాబ్ పైనా జోరుగా పందెలు కాస్తున్నారు. క్వాలిఫయర్ మ్యాచులో పటిష్టమైన ముంబైని మట్టికరిపించడంతో పంజాబ్ పై భారీగా పెరిగిన అంచనాలు. రెండు జట్లు ఇప్పటి వరకు ఒక్క కప్ కూడా కొట్టకపోవడంతో ఈ మ్యాచ్ పై నరాలు తెగే ఉత్కంఠ. ఎవరు గెలిచినా ఫస్ట్ టైం ఐపీఎల్ విన్నర్ గా అవతరించనున్నారు. 60 శాతం ఆర్సీబీ.. 40 శాతం పంజాబ్ పైనా బెట్టింగ్ రేషియో నడుస్తోన్నట్లు టాక్. ప్రిడిక్షన్స్ మాత్రం 50-50 అంటూ అంచనా.
 

©️ VIL Media Pvt Ltd.
Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.