
మంగళవారం (జూన్ 3) అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగబోయే ఫైనల్ మ్యాచ్ కు UK మాజీ ప్రధాన మంత్రి రిషి సునక్ హాజరుకానున్నారు. పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగబోయే ఈ మెగా ఫైనల్ కు ఆయన రావడం కన్ఫర్మ్ అయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి తాను బిగ్ ఫ్యాన్ అని రిషి సునక్ అన్నారు. విరాట్ కోహ్లీ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్ లో ఉంది. కోహ్లీ తన ఆటతో ఏకంగా బ్రిటన్ ప్రధానిని ఆకట్టుకున్నాడు.
భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ 2023లో కోహ్లీ ఆటోగ్రాఫ్ చేసిన బ్యాట్ ను యూకే ప్రధాన మంత్రి రిషి సునక్ కు గిఫ్ట్ గా అందజేశాడు. “నేను బెంగళూరు కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. కాబట్టి RCB న ఫేవరేట్ జట్టు”. అని రిషి సునక్ అన్నారు. కోహ్లీ పట్ల తన అభిమానాన్ని చాటుకుంటూ.. సునక్ విరాట్ ను క్రికెట్ లెజెండ్ అని ప్రశంసించారు. మంగళవారం అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగే టైటిల్ ఫైట్లో ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇందులో నెగ్గి తొలిసారి ఐపీఎల్ చాంపియన్గా నిలవాలని ఇరు జట్లూ తహతహలాడుతున్నాయి.
ఇందులో నెగ్గి తొలిసారి ఐపీఎల్ చాంపియన్గా నిలవాలని ఇరు జట్లూ తహతహలాడుతున్నాయి. ఈ పోరులో ఆర్సీబీ సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ, పంజాబ్ లీడర్ శ్రేయస్ అయ్యర్పై అందరి ఫోకస్ ఉండనుంది. నాలుగోసారి ఫైనల్ ఆడుతున్న కోహ్లీకి సపోర్ట్గా వేలాది మంది ఫ్యాన్స్ నం. 18 జెర్సీలతో స్టేడియానికి పోటెత్తే అవకాశం ఉంది. ఇంకోవైపు మూడు జట్లను ఫైనల్ చేర్చిన (ఢిల్లీ, కేకేఆర్, పంజాబ్) కెప్టెన్గా అరుదైన రికార్డు సృష్టించిన అయ్యర్ వరుసగా రెండోసారి ట్రోఫీని ముద్దాడాలని కోరుకుంటున్నాడు.