
- రాష్ట్ర అభివృద్ధిలో మరింత ఉధృతంగా భాగస్వామ్యం కావాలి
- ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం,
- మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి
ముషీరాబాద్, వెలుగు: స్వరాష్ట్ర ఉద్యమంలో తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం (టీడీఎఫ్) కీలకపాత్ర పోషించిందని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి కొనియాడారు. అశోక్ నగర్ లో టీడీఎఫ్ఆఫీస్ను సోమవారం వారు ప్రారంభించారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించిన ఫోరం రాష్ట్ర అభివృద్ధిలో మరింత ఉధృతంగా భాగస్వామ్యం కావాలని, తన వంతు సహకారం అందించాలని కోరారు. ప్రజల అవసరాలు ఆకాంక్షలకు పాటుపడాల్సిన అవసరం ఉందన్నారు.
తెలంగాణ విద్యారంగ స్థితిగతులపై ఫోరం చర్చించి, మంచి నివేదిక తీసుకొచ్చిందన్నారు. తెలంగాణ రైతు సంక్షేమ కమిషన్ సభ్యురాలు భవానీ, టీడీఎఫ్ అధ్యక్షుడు ఎం రాజేశ్వర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, సుశీల్, ఎంవీ గోనారెడ్డి, వినీల్ రెడ్డి, టి వాణి, అరుణ్ కుమార్, అంజు రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రమేశ్, కృష్ణారెడ్డి, రాజ్ మోహన్ పాల్గొన్నారు.