
కాగజ్ నగర్, వెలుగు: ‘సార్ పోడు భూముల మీద ఆధారపడి బతుకుతున్నాం. మా భూముల్లో ఫారెస్టోళ్లు మొక్కలు నాటుతామని, ట్రెంచ్ కొడతామని బెదిరిస్తున్నారు, మా భూములు పోకుండా మీరే చూడాలి’ అని పెంచికల్ పేట్ మండలం జైహింద్పూర్ గ్రామ పోడు రైతులు ఎమ్మెల్సీ దండె విఠల్ ముందు కన్నీటి పర్యంతమయ్యారు. ఫారెస్ట్ అధికారులు ఎప్పుడు వెళ్లి తమ భూముల్లో మొక్కలు నాటుతారోనని ఆందోళనతో నాలుగు రోజులుగా పోడు భూముల్లోనే గ్రామస్తులు మకాం వేశారు.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ దండే విఠల్ వారి వద్దకు వెళ్లి సమస్యలు విన్నారు. రైతులకు ఇబ్బంది పెట్టొద్దని డీఎఫ్వో నీరజ్ కుమార్ టిబ్రేవాల్తో ఫోన్ లో మాట్లాడారు. సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని వారికి హామీ ఇచ్చారు. వారిని సముదాయించడంతో ఇండ్లకు వెళ్లిపోయారు.
ఆరె కులస్తుల ఓబీసీలోకి చేర్చేలా కృషి చేస్తా
దహెగాం, వెలుగు: ఆరె కులస్తులను ఓబీసీలో చేర్చేలా కృషి చేస్తానని ఎమ్మెల్సీ దండె విఠల్అన్నారు. దహెగాం మండలంలోని ఇట్యాలలో ఆరె కులస్తులు ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్విగ్రాహాన్ని సోమవారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఆరె కులస్తులు ఓబీసీ సర్టిఫికెట్ కోసం ఎన్నో ఏండ్లుగా పోరాడుతున్నారని, సర్టిఫికెట్ లేక యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని, ఓబీసీ సర్టిఫికెట్ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. శివాజీ జయంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు.
మండల కేంద్రంలో కమ్యూనిటీ హాల్ నిర్మించుకునేందుకు ప్రభుత్వం రూ.25 లక్షలు మంజూరు చేసిందన్నారు. ఆరె కుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాన్పల్లి దాదారాం, వివిధ మండలాల అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.