
India vs England 1st Test: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జూన్ 20 నుంచి లీడ్స్లోని హెడింగ్లీ మైదానంలో జరుగుతుంది. ఇంగ్లాండ్ జట్టు గడ్డితో కూడిన ఆకుపచ్చ టాప్ పిచ్ను సిద్ధం చేయవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితిలో, భారత యువ బ్యాట్స్మెన్స్ ఇంగ్లీష్ ఫాస్ట్ బౌలర్ల స్వింగ్, సీమ్కు వ్యతిరేకంగా ఇబ్బంది పడుతుండటం తప్పదని తెలుస్తోంది. భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య స్వింగ్, సీమ్ బౌలింగ్ అతిపెద్ద అంశం అవుతుంది. ఇది సిరీస్లో ఇంగ్లండ్ ఆధిపత్యాన్ని చాలా వరకు స్పష్టం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. లీడ్స్లో ఇంగ్లాండ్తో జరిగే తొలి టెస్ట్ మ్యాచ్లో ఆడే టీమిండియా ప్లేయింగ్ 11ని ఓసారి చూద్దాం..
ఓపెనర్లు..
లీడ్స్లో ఇంగ్లాండ్తో జరిగే తొలి టెస్ట్ మ్యాచ్లో యశస్వి జైస్వాల్ కేఎల్ రాహుల్తో కలిసి ఇన్నింగ్స్ను ప్రారంభించవచ్చు. కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ తమ తుఫాన్ బ్యాటింగ్తో టీమ్ ఇండియాకు దూకుడుగా ఆరంభం ఇవ్వగలరు. ఇటువంటి పరిస్థితిలో, అభిమన్యు ఈశ్వరన్ ప్లేయింగ్ ఎలెవన్ నుంచి దూరంగా ఉండాల్సి ఉంటుంది.
మిడిల్ ఆర్డర్..
లీడ్స్లో ఇంగ్లాండ్తో జరిగే తొలి టెస్ట్ మ్యాచ్లో, కుడిచేతి వాటం బ్యాట్స్మన్ కరుణ్ నాయర్ 3వ స్థానంలో బ్యాటింగ్కు రావొచ్చు. కెప్టెన్ శుభ్మాన్ గిల్ 4వ స్థానంలో బ్యాటింగ్కు రావొచ్చు. రిషబ్ పంత్కు 5వ స్థానంలో బ్యాటింగ్ బాధ్యత అప్పగించనున్నారు. రిషబ్ పంత్ వికెట్ కీపర్ కం బ్యాట్స్మన్గా ఆడనున్నాడు. ఇటువంటి పరిస్థితిలో, సాయి సుదర్శన్ ప్లేయింగ్ ఎలెవన్ నుంచి దూరంగా ఉండాల్సి ఉంటుంది.
ధ్రువ్ జురెల్కు పెద్ద బాధ్యత..
లీడ్స్లో ఇంగ్లాండ్తో జరిగే తొలి టెస్ట్ మ్యాచ్లో ధ్రువ్ జురెల్కు 6వ స్థానంలో అవకాశం లభించవచ్చు. రవీంద్ర జడేజా తన స్పిన్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్తో టీమ్ ఇండియాను బలోపేతం చేయనున్నాడు. రవీంద్ర జడేజా ఏకైక స్పిన్నర్గా ఆడితే, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ ప్లేయింగ్ ఎలెవన్ నుంచి దూరంగా ఉండాల్సి ఉంటుంది.
ఆల్ రౌండర్..
ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్గా శార్దూల్ ఠాకూర్కు ప్లేయింగ్ ఎలెవెన్లో అవకాశం ఇవ్వవచ్చు. శార్దూల్ ఠాకూర్ బంతిని స్వింగ్ చేయడంలో నిపుణుడు. శార్దూల్ ఠాకూర్ ఇంగ్లాండ్లో 4 టెస్ట్ మ్యాచ్లు ఆడి 10 వికెట్లు పడగొట్టాడు. ఇలాంటి పరిస్థితిలో, నితీష్ రెడ్డి ప్లేయింగ్ ఎలెవెన్ నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది.
ఫాస్ట్ బౌలర్..
జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్ ఫాస్ట్ బౌలర్లుగా టీం ఇండియా ప్లేయింగ్ ఎలెవెన్లో చోటు సంపాదించవచ్చు. ఇటువంటి పరిస్థితిలో ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్దీప్లు ప్లేయింగ్ ఎలెవెన్ నుంచి దూరంగా ఉండాల్సి ఉంటుంది.
ఇంగ్లాండ్తో జరిగే తొలి టెస్టుకు భారత జట్టు ఆడే అవకాశం ఉన్న XI: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్.
— BCCI (@BCCI) June 8, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..