మొదటి టీజర్తో ఒక సంచలనం సృష్టించిన తర్వాత ‘8 వసంతాలు’ (8 vasantalu) చిత్ర నిర్మాతలు ఇప్పుడు రెండో టీజర్ను రిలీజ్ చేశారు. టీజర్ మంచి ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ అందించింది. ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించారు. అనంతిక సనీల్కుమార్ ప్రధాన పాత్రలో నటించారు. టీజర్ విజువల్గా (Teaser visual) కవితాత్మక సన్నివేశంతో ప్రారంభమవుతుంది. వర్షంలో తడిసిన అనంతిక, ఊటీకి వచ్చిన కొత్త తెలుగు రచయిత సంజయ్ను గమనిస్తుంది.
అతను పదాలని ప్రేమతో రాస్తే తడిసిన గులాబీ పువ్వుల్లా వుంటాయి. అదే కసితో రాస్తే పిన్ తీసిన గ్రెనేడ్లా ఉంటాయి’అనే వాయిస్ సంజయ్ పాత్రని అద్భుతంగా చూపించింది. విజువల్గా, ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్లా వుంది. విశ్వనాథ్ రెడ్డి అద్భుతమైన సినిమాటోగ్రఫీ, హేషమ్ అబ్దుల్ వహాబ్ మనసుని కదిలించే స్కోర్తో ఫణీంద్ర నర్సెట్టి అద్భుతమైన సంభాషణలు ప్రాణం పోసుకున్నాయి. అనంతిక సనిల్కుమార్ అద్భుతంగా కనిపించారు. తన పర్ఫార్మెన్స్ హార్ట్ టచ్చింగ్గా వుంది. 8 వసంతాలు చిత్రం జూన్ 20న థియేటర్లలో విడుదల కానుంది.