
ప్రతీ సంవత్సరం మృగశిర కార్తె ప్రారంభం రోజున హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేపమందు ప్రసాదం పంపిణీ చేస్తారు. ఈ ఏడాది కూడా చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం చేశారు అధికారులు. మరికొద్ది సేపట్లో చేపమందు ప్రసాదం పంపిణీ ప్రారంభం కానుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి చేప మందు కోసం ఆస్తమా బాధితులు వచ్చారు. జిహెచ్ఎంసి.. పోలీస్, వైద్య ఆరోగ్యశాఖ పలు శాఖల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Also Read:Maganti Gopinath: మాగంటి గోపీనాథ్ మరణం పట్ల కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి.. సీఎం రేవంత్ సంతాపం
ప్రధాన రైల్వే స్టేషన్లు, బస్టాండ్ ల నుంచి చేపమందు పంపిణీ వద్దకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు ఆర్టీసీ అధికారులు. 42 క్యూ లైన్ కౌంటర్లలో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. అన్ని కౌంటర్ల వద్ద ప్రత్యేక పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. మరికొద్ది సేపట్లో చేప ప్రసాద పంపిణీ ప్రారంభించనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్. CCTV కెమెరాలతో మానిటర్ చేస్తున్నారు. 1000 మంది పోలీసులతో భద్రత కట్టుదిట్టం చేశారు. VIPల కోసం 4 గేట్లు, వికలాంగులు, సీనియర్ సిటిజన్ల కోసం 3 గేట్లు ఏర్పాటు చేశారు. అజంతా గేట్ నుంచి సామాన్యులకు ప్రవేశం కల్పించనున్నారు.