
హైదరాబాద్లోని ఫిల్మ్ నగర్లో జరిగిన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ బాడీ మీటింగ్లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో సినీ పరిశ్రమలోని పలు కీలక అంశాలు, ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఎదుర్కొంటున్న సంక్షోభం గురించి చర్చించారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 2023-2025 కాలానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. ఈ కార్యవర్గంలో ప్రముఖ నిర్మాత మరియు ఎగ్జిబిటర్ అయిన సునీల్ నారంగ్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్లుగా రవీంద్ర గోపాల్, ఉదయ్ కుమార్ రెడ్డి కె ఎన్నిక కాగా, శ్రీధర్ వి.ఎల్. సెక్రటరీగా, చంద్రశేఖర్ రావు జే. జాయింట్ సెక్రటరీగా, సత్యనారాయణ గౌడ్ బి. ట్రెజరర్గా ఎన్నికయ్యారు.
Also Read : Anupam Kher : గోడ దూకి షూట్ కి వెళ్లిన అనుపం ఖేర్
అలాగే, 14 మంది సభ్యులతో కూడిన ఎగ్జిక్యూటివ్ కమిటీని కూడా ఎన్నుకున్నారు. సమావేశంలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ప్రధాన చర్చాంశంగా నిలిచింది. సెక్రటరీ శ్రీధర్ వి.ఎల్. మాట్లాడుతూ, 2016 నుంచి థియేటర్లలో రెవెన్యూ షేరింగ్ విధానం కోసం పోరాటం చేస్తున్నామని, అయినప్పటికీ సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఆర్థిక ఇబ్బందుల కారణంగా మూతపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు కేవలం మూడు సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయని, ఈ పరిస్థితి కొనసాగితే సింగిల్ స్క్రీన్ థియేటర్లు పూర్తిగా మూతపడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
Also Read : Kannappa : కన్నప్ప సినిమాను అడ్డుకుంటాం.. బ్రాహ్మణ సంఘాల ఆగ్రహం
పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా కోసం థియేటర్లను ఖాళీగా ఉంచినట్లు తెలిపారు. ఈ చిత్రం జూలై 4, 2025న విడుదల కావచ్చనే ఆశతో థియేటర్ యజమానులు సన్నాహాలు చేస్తున్నారు. సునీల్ నారంగ్ మాట్లాడుతూ, థియేటర్ల బంద్ గురించి ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదని, అయితే ఆర్థిక నష్టాల కారణంగా కొన్ని థియేటర్లు తాత్కాలికంగా మూతపడ్డాయని స్పష్టం చేశారు. సమావేశంలో అయితే, ఈ చిత్రం విడుదల తేదీ ఇంకా అధికారికంగా నిర్ధారణ కాని నేపథ్యంలో, థియేటర్ల ఆర్థిక స్థితిపై ఒత్తిడి పెరుగుతోంది.