
హైదరాబాద్ నగరంలో జనాభా పెరుగుదల దృష్ట్యా పర్యావరణ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రవాణా శాఖ మంత్రి పొన్నం చొరవతో పెట్రోల్ ,డీజిల్ లేని 65 వేల కొత్త త్రి వీలర్ ఆటో రిక్షాలకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నగరంలో గత కొంతకాలంగా కొత్త ఆటో రిక్షాలకు పరిమితి ఉంది. కొత్త ఆటో రిక్షాలు పరిమిట్లు ఇవ్వడానికి లేదు. ఆ పరిమితిని సడలిస్తూ జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ లోపల పరిమిత సంఖ్యలో ఎలక్ట్రిక్, సిఎన్జీ, ఎల్పీజీ ఆటో రిక్షాలకు అనుమతి ఇస్తూ జీవో నెంబర్ 263 విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read:UP: కొంప ముంచిన కోతి.. రూ.20 లక్షల విలువైన నగల పర్సుతో జంప్..!
హైదరాబాద్ నగరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుంది. నగరంలో రోజురోజుకు జనాభా పెరుగుదల, ORR లోపల ఏర్పడిన కొత్త లేఅవుట్ల, అపార్ట్మెంట్లు ఫలితంగా పట్టణీకరణ వివిధ సవాళ్లు తలెత్తాయి. నగరంలో జనాభాలో అపారమైన పెరుగుదల కారణంగా ఆటో రిక్షా పర్మిట్లకు డిమాండ్ పెరిగింది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, హైదరాబాద్ నగరంలో వాయు, శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడానికి, ప్రజా రవాణా మెరుగుపరచడానికి ఎలక్ట్రిక్/LPG/CNG ఆటో రిక్షాలను అనుమతించడం అవసరమని ప్రభుత్వం భావించింది..
Also Read:Ravi Teja : మాస్ రాజా రవితేజ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్..
ఓఆర్ఆర్ లోపల కొత్తగా 20 వేల ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలకు అనుమతి, 10 వేల కొత్త LPG ఆటో రిక్షాలకు అనుమతి, 10 వేల కొత్త CNG అటో రిక్షాలకు అనుమతి, డీజిల్, పెట్రోల్ వాహనాలకు సంబంధించిన ఆటోలకు రేటిరోఫీట్మెంట్ చేసి వాటి ఇంజన్ ను ఎలక్ట్రిక్, CNG,LPG లాగా మార్చుకోవడానికి 25 వేల వాహనాలకు అనుమతి ఇస్తూ జీవో విడుదల చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఉన్న డీజిల్ ,పెట్రోల్ ఆటో రిక్షాల ట్రాన్సఫర్ లేదా డీజిల్ పెట్రోల్, కొత్త ఆటో రిక్షాలకు ఓఆర్ఆర్ పరిధిలో అనుమతించబడవు. ఈ ఎలక్ట్రిక్ వాహనాలు CNG,LPG తీసుకురావడానికి రెండు ప్రధాన కారణాలున్నాయి. ఓ ఆర్ ఆర్ లోపల ప్రజా రవాణా ను మెరుగుపరచవచ్చు.. ఎలక్ట్రిక్ , LPG, CNG ఆటోలకు అనుమతి ఇచ్చి నగరంలో కాలుష్యాన్ని తగ్గించవచ్చు.. ఈ ప్రభుత్వ ఆదేశాల ద్వారా దాదాపు 65 వేల కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు.