. < 1 minute

కాళేశ్వరం తప్పు ఇంజినీర్లదే.. కేసీఆర్ తాన అంటే తందాన అన్నరు : ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

Caption of Image.

= ఈటలను సపోర్ట్ చేసేందుకు రాలేదు
= డిజైనింగ్ చర్చలో హరీష్ , ఈటల లేరు
= ఈటల కేసీఆర్ ను ప్రొటెక్ట్ చేశారనేది వంద శాతం తప్పు
= ప్రాణహిత–చేవెళ్ల ఒక అసాధ్యమైన ప్రాజెక్ట్
= దాంతో చేవెళ్లకు ఒక చుక్క నీరు కూడా రాదు
= చేవెళ్ల ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణలోపాలకు తప్పు ఇంజినీర్లదేనని, కేసీఆర్ తాన అంటే తందాన అన్నారని చేవెళ్ల ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీ ఈటల రాజేందర్ మాజీ సీఎం కేసీఆర్ ను ప్రొటెక్ట్ చేశారనే వాదన వంద శాతం తప్పని కుండ బద్దలు కొట్టారు. డిజైనింగ్ చర్చలో ఈటల, హరీశ్ రావు పాల్గొనలేదని అన్నారు. 

కాంగ్రెస్ హయాంలో నిర్మించ తలపెట్టిన ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టు ఒక అసాధ్యమైందని, దాంతో చేవెళ్ల ప్రాంతానికి చుక్క నీరు కూడా రావని అన్నారు. కాంగ్రెస్ నాయకులు కేవలం మాయమాటలు చెప్పారని అన్నారు. దానిని కేసీఆర్ రద్దు చేస్తారని భావిస్తే ఆయన అంబేద్కర్ పేరు తొలగించి కాళేశ్వరం పేరు పెట్టారని చెప్పారు. ఈ రెండింటిలో కాంగ్రెస్  ప్రభుత్వం చేసిన డిజైన్ బాగుందని, కేసీఆర్ డిజైన్ బాగాలేదని అన్నారు.  

కాళేశ్వరం డిజైనింగ్ చర్చలో హరీశ్ రావు, ఈటల లేరని అన్నారు.ఈ టోటల్ ఎపిసోడ్ లో ఈటలది చిన్న పాత్ర మాత్రమేనని చెప్పారు. ఇంత పెద్ద అవినీతి జరిగినా ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలన్నారు. ఈటల విచారణలో ఏం చెప్పారో తనకు తెలియదని, అయితే ఇందులో ఆయన పాత్ర జీరో అని అన్నారు. ఈటల కేసీఆర్ ను ప్రొటెక్ట్ చేశారనడం వంద శాతం తప్పని అన్నారు. 

తాను ఈటలకు సపోర్ట్ చేసేందుకు మీడియా ముందుకు రాలేదని, నిజాలు చెప్పేందుకు వచ్చానని అన్నారు. గులాబీ జెండా అందరిదీ అన్న ఈటలను తన్ని వెళ్లగొట్టారని, అలాంటి కేసీఆర్ ను ఈటల ఎందుకు ప్రొటెక్ట్ చేస్తారని ప్రశ్నించారు.

©️ VIL Media Pvt Ltd.
Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.