
తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం నెలకొన్న సమస్యలపై ఓ ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. నేడు (జూన్ 7న) సినీ పరిశ్రమ సమస్యలను పరిష్కారించడానికి 30 మంది సభ్యులతో కూడిన ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటించింది.
ఇందులో మూడు రంగాలు (నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల) సెక్టార్ల నుంచి 30 మంది సభ్యులతో ఈ కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ.. సినీ పరిశ్రమలో ఉన్న అన్నీ రకాల సమస్యలను పరిష్కరించే దిశగా వెళుతుందని ఫిల్మ్ ఛాంబర్ వెల్లడించింది.
ఈ ప్రత్యేక కమిటీకి ఛైర్మన్గా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ వ్యవహరించనున్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్ కన్వీనర్గా ఉండనున్నారు.
నిర్మాతల విభాగం తరఫున దిల్ రాజు, దామోదర ప్రసాద్, ప్రసన్నకుమార్, సి.కల్యాణ్, రవికిషోర్, రవి శంకర్, నాగవంశీ, దానయ్య, స్వప్నదత్, సుప్రియ ఇందులో సభ్యులుగా ఉన్నారు.
నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్స్ మధ్య నెలకొన్న ఆందోళన ఉదృతం అవుతున్న క్రమంలో ఈ కమీటీ ఏర్పాటైంది. దాదాపు రమూడు నెలల నుంచి సమస్య ఉదృతం అయింది.
►ALSO READ | బ్రాహ్మణుల పిలక ఎంత పవిత్రమైనదనేది.. మోహన్ బాబుకి జీవితంలో తెలియదు:
రెంటల్ బేసిస్లో షోలు వేయలేమని.. పర్సంటెజీ రూపంలో చెల్లింపులు చేస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని ఎగ్జిబిటర్స్ చెబుతూ వస్తున్నారు. రోజువారీ అద్దె కాకుండా గ్రాస్ కలెక్షన్స్లో వాటా ఇవ్వాలని కోరుతున్నారు. ఇలా నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకి మధ్య వివాదం నడుస్తుండటంతో ఫిల్మ్ ఛాంబర్ ప్రత్యేక కమిటీ వేసింది. మరి ‘పర్సంటేజ్ సిస్టమ్ vs థియేటర్స్ రెంట్’ గురించి ఈ కమిటీ ఏం నిర్ణయిస్తుందో చూడాలి.
Telugu Film Chamber of Commerce forms An Internal Committee consisting of 30 members, representing three sectors, to address the issues between Producers, Distributors and Exhibitors. pic.twitter.com/RJCXAX67YW
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) June 7, 2025