
కోడిగుడ్డులో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ రోజూ గుడ్డు తినమని నిపుణులు సూచిస్తున్నారు. అయితే కొంతమంది ముఖ్యంగా క్రీడాకారులు గుడ్డుని ఉడకబెట్టుకుని ఉదయమే అల్పాహారంగా తింటారు. నాన్ వెజ్ ప్రియులు ఇంట్లో ఏ కూర లేకపోతే కోడి గుడ్డుతో ఆమ్లెట్ అయినా వేసుకుని అన్నం తినేస్తారు. ఈ కోడి గుడ్లతో రకరకాల ఆహర పదార్ధాలను తయారు చేస్తారు. అంతేకాదు కోడి గుడ్డుతో కూరలు మాతరమే కాదు బిర్యానీని కూడా చేసుకుంటారు. ఇక ఈ రోజు భిన్నంగా కోడి గుడ్డు కారం తయారు చేయడం గురించి తెల్సుకుందాం.. ఇది మసాలాతో చాలా రుచిగా ఉంటుంది. పెద్దలుపిల్లలు అనే తేడ లేకుండా ఇష్టంగా తినేస్తారు ఈ గుడ్డు కారంని చాలా సిపుల్ గా త్వరగా చేసుకోవచ్చు. రెసిపీ మీ కోసం
కావాల్సిన పదార్థాలు :
కోడి గుడ్లు – నాలుగు
ఉల్లిపాయ – ఒకటి
నువ్వులు లేదా పల్లీలు – రెండు టీస్పూన్లు
ఎండుకొబ్బరి ముక్కలు – ఒక టేబుల్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీస్పూన్
వెల్లుల్లి రెబ్బలు – నాలుగు
ధనియాలు – రెండు టీ స్పూన్లు
జీలకర్ర – అర టీస్పూన్
యాలకులు – రెండు
లవంగాలు – మూడు
దాల్చిన చెక్క – చిన్న ముక్క
కారం – రెండు టీ స్పూన్లు
పసుపు – పావు టీస్పూన్
పచ్చిమిర్చి – నాలుగు
కరివేపాకు – నాలుగు రెమ్మలు
కొత్తిమీర తరుగు – కొద్దిగా
ఉప్పు – రుచికి తగినంత
నూనె – నాలుగు టేబుల్ స్పూన్లు
తయారీ విధానం : ముందుగా గుడ్లను ఉడికించుకుని వాటి మీద ఉన్న పెంకు తీసి గాట్లు పెట్టి ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఎండుకొబ్బరి ముక్కలు, లవంగాలు, యాలకులు, జీలకర్ర, ధనియాలు, దాల్చినచెక్క వేసుకుని తక్కువ మంట మీద వేయించుకోవాలి. ఇప్పుడు నువ్వులు వేసి దోరగా వేయించుకుని వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత ఈ మసాలా దినుసులను మిక్సీ గిన్నెలో వేసుకుని వెల్లుల్లి రెమ్మలు, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలా మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఉల్లిపాయను కచ్చకపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేడి ఎక్కినా తర్వాత కోడి గుడ్లు వేసి.. కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి వీటిని వేయించాలి. కోడి గుడ్లు వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని అదే నూనె లో కట్ చేసిన పచ్చి మిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయ పేస్ట్ ని వేసి తక్కువ మంటపై దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వత అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకూ వేయించాలి. తర్వాత ఈ ఉల్లిపాయ మిశ్రమంలో వేయించిన కోడి గుడ్లు. రెడీ చేసుకున్న మసాలా పొడి వేసుకుని బాగా కలిపి బాణలి పై మూత పెట్టుకుని కొంచెం సేపు మగ్గించాలి. చివరిగా కొత్తమీర ముక్కలు చల్లి ఒక్కసారి బాగా కలిపి దింపేసుకోవాలి. అంతే చూస్తేనే నోరూరించే కోడి గుడ్డు కారం రెడీ. వేడి వేడి అన్నంతో ఈ కోడి కూరం వేసి పిల్లలకు అందించండి. మారం చేయకుండా అన్నం అంతా తినేస్తారు.
Note: కోడి గుడ్డు కారంలో నువ్వుల ప్లేస్ లో వేరుశనగలను అయినా వేసుకోవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..