
నాగార్జున ఒకపక్క తన కుమారుడు అఖిల్ వివాహంతో బిజీగా ఉన్నప్పటికీ, సెకండ్ గీర్ ఇవ్వకుండా తన వృత్తి ధర్మాన్ని చాటుకున్నాడు. అసలు విషయం ఏమిటంటే, నాగార్జున ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర అనే సినిమా చేస్తున్నాడు. ధనుష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నాగార్జున ముంబై బేస్డ్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారు. ముంబైలో పుట్టి, అడుక్కు తినే స్థాయి నుంచి ఒక పెద్ద మాఫియా డాన్గా ఎదిగిన వ్యక్తిగా ధనుష్ కనిపించబోతున్నాడు.
Also Read: కుర్రాళ్లలో హీటు పెంచేస్తున్న గోల్డెన్ గర్ల్ అనసూయ.. తట్టుకోగలరా?
సరిగ్గా నిన్న ఉదయమే అక్కినేని అఖిల్ వివాహం జరిగినప్పటికీ, సినిమాకు ఏమాత్రం బ్రేక్ తీసుకోకుండా నాగార్జున తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ను పూర్తి చేశారు. ఈ మేరకు సినిమా టీమ్ ఒక ఫోటో రిలీజ్ చేసింది. అందులో నాగార్జున, శేఖర్ కమ్ములతో కలిసి డబ్బింగ్ థియేటర్లో గమ్మున కూర్చుని కనిపిస్తున్నారు.
Also Read: Tollywood: సినీ సమస్యల పరిష్కారానికి ఇంటర్నల్ కమిటీ!
కుబేర జూన్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ట్రైలర్తో సహా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ప్లాన్లు సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాలో రష్మికా మందన్న హీరోయిన్గా నటిస్తుంది. ధనుష్, నాగార్జున, రష్మికా, జిమ్ సర్భ్ పాత్రల చుట్టూ కథ నడుస్తుందని తెలుస్తోంది.