
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎంత నిరాడంబరంగా ఉంటారో, ప్రజలతో ఎంతగా మమేకవుతారో తెలిసిన విషయమే. కార్యకర్తల నుంచి సామాన్య ప్రజల వరకు ఎవరితోనైనా చర్చించేందుకు, అభిప్రాయం తీసుకునేందుకు వెనకాడరు. శనివారం (జూన్ 7) ఒక యువతితో ముచ్చటించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బీహార్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ రియా పాశ్వాన్ అనే యువతితో చేసిన చర్చ వైరల్ గా మారింది. గయాలో ఏర్పాటు చేసిన మహిళా సంవాద్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. రియా పాశ్వాన్ తో చర్చించారు. ఈ సందర్భంగా రాహుల్ ను ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లో చేరినట్లు ఆమె చెప్పారు. ప్రజా సేవ కోసం తన జీవితాన్ని అంకితం చేయాలనుందని అన్నారు.
అయితే ఈ సందర్భంగా తాను రాహుల్ గాంధీ మాదిరిగానే పెళ్లి చేసుకోకుండా ఉండిపోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పడం ఆసక్తికరంగా మారింది. ప్రజా సేవ చేయడం కోసం పెళ్లికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. పాలిటిక్స్ ద్వారా సమాజంలో మార్పు తీసురవచ్చునని.. కానీ చాలా మంది అది చేయరని రాహుల్ గాంధీతో చెప్పారు. కాంగ్రెస్ నిర్ణయాల వలన రాజకీయాల్లోకి మహిళ ప్రాతినిధ్యం పెరిగిందని తెలిపారు.
రియా పాశ్వాన్ స్పీచ్ ను రాహుల్ గాంధీ మెచ్చుకున్నారు. గుడ్ స్పీచ్ అని అభినందించారు. ఈ సందర్భంగా ‘‘మీ లాగే నేను పెళ్లి చేసుకోకుండా సేవ చేయాలని నిర్ణయించుకున్నాను’’ అని చెప్పారు. రియా పాశ్వాన్ మాట్లాడిన తరీకు, ఆమె కాన్ఫిడెన్స్ ను రాహుల్ గాంధీ మెచ్చుకున్నారు. అనుకున్నది సాధిస్తావని ఈ సందర్భంగా చెప్పారు.
రియా పాశ్వాన్ సభలల్లో నేతలు, అధికారులతో నిర్మొహమాటంగా మాట్లాడుతూ ఫేమస్ అయ్యారు. 2022లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ను ఫ్రీ సానిటరీ పాడ్స్ ఇవ్వాల్సిందిగా సభా ముఖంగా అడగటం అప్పట్లో చర్చనీయాంశం అయ్యింది. దీంతో మహిళలకు ఫ్రీ పాడ్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి రియా పాశ్వాన్ ను పాడ్ గర్ల్ అంటుంటారు. తాజాగా రాహుల్ గాంధీతో కూడా పెళ్లిపై నిర్మొహమాటంగా మాట్లాడిన తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
आज गया में Shakti Samvad कार्यक्रम के मंच से मैंने अपनी आवाज़ उठाई – महिलाओं के मुद्दे, मोहल्ले की समस्याएं, और जनता की सच्चाई को Rahul Gandhi ji के सामने रखा।
मैं Riya Paswan हूं, और मैं हर ग़लत के खिलाफ खड़ी हूं। pic.twitter.com/7ymZftN8W0— Riya Kumari (@kumarir6529) June 7, 2025