
Satyakumar Yadav : ప్రతి ఒక్కరి సంక్షేమమే బీజేపీ ధ్యేయం అని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో బీజేపీ జిల్లా వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాటి నుండి ఆగష్టు 5 వరకు విస్తృతంగా మొక్కలు నాటడంతో పాటు సీడ్ బాల్ తయారీ చేయాలన్నారు. జూన్ 23 శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్బంగా ప్రతి పోలింగ్ బూతులో పుష్పాంజలి ఘటించాలన్నారు.
Read Also : Seediri Appalaraju : పెన్షన్లను తగ్గించిన ఘనత బాబుదే.. సీదిరి అప్పలరాజు కామెంట్స్..
‘జూన్ 25 నాటికి ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తి అయ్యాయి. క్రూరత్వం, ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన, చీకటి జ్ఞాపకాలు ఇప్పటికీ మన దేశంలో అలాగే ఉన్నాయి. మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి మాత్రం ప్రతి ఒక్కరి సంక్షేమం, అభివృద్ధినే ధ్యేయం. ప్రతిజిల్లాలో ప్రొఫెషనల్ సమావేశం, ఎగ్జిబిషన్ జూన్ 11, 12 లలో నిర్వహించాలి. ప్రతి మండలంలో వికసిత్ భారత్ సంకల్ప సభ జూన్ 13,14,15 తేదీలలో నిర్వహించాలి. నగరాల్లో వీధుల్లోని రచ్చబండల వద్ద జూన్ 16,17,18 తేదీల్లో నిర్వహించాలి. ఇంటింటి ప్రచారం జూన్ 15 నుండి 20 వరకు చెయ్యాలి’ అంటూ తెలిపారు.
Read Also : Anagani Satyaprasad : అమరావతి మహిళలను కించపరచడం దుర్మార్గం.. అనగాని సత్యప్రసాద్ ఫైర్