
బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి ఏర్పాట్లు జరగుతున్నాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రెండు పార్టీల బంధ బలోపేతానికి ఈటల వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. ఈటల, హరీశ్ సమావేశం దేనికి సంకేతమని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ కు కాళేశ్వరం ఏటీఎం అని బీజేపీ విమర్శలు చేసిందన్నారు. గతంలో చేసిన వ్యాఖ్యలకు విరుద్ధంగా ఇపుడు బీజేపీ వ్యాఖ్యలు చేస్తుందన్నారు. బీఆర్ఎస్ కు కాళేశ్వరం ఏటీఎం అని మోదీ, నడ్డా విమర్శలు చేశారని చెప్పారు. మోదీ, నడ్డా వ్యాఖ్యలకు విరుద్ధంగా ఈటల కామెంట్స్ ఉన్నాయన్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మోదీనే విమర్శించారని చెప్పారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని బండి సంజయ్ కూడా విమర్శలు చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ ను కాపాడేందుకు ఈటల ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈటల,హరీశ్ లు ఇద్దరు అనుకునే ప్రెస్ మీట్ లు పెట్టారని చెప్పారు.
జూన్ 6న కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరైన ఈటల రాజేందర్.. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిర్మించాలన్నది అప్పటి సీఎం కేసీఆర్నిర్ణయమేనని తెలిపారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్ట్రీడిజైన్లో భాగంగా తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు బ్యారేజీ మార్పుపై టెక్నికల్ టీమ్స్ స్టడీ చేసి రిపోర్ట్ఇచ్చాయి. ఆ రిపోర్ట్ఆధారంగా ప్రాజెక్ట్ లొకేషన్లను నాటి సీఎం కేసీఆర్ మార్చారని చెప్పారు. ప్రాజెక్టుపై కేసీఆరే నిర్ణయం తీసుకున్నారని, కేబినెట్తో ఆమోదింపజేశారని తెలిపారు. ఫైనాన్స్డిపార్ట్మెంట్కు ఏం సంబంధం లేదని పేర్కొన్నారు.