సిమ్లా: కాంగ్రెస్ అగ్రనేత, పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. డాక్టర్ల పర్యవేక్షణలో సోనియా గాంధీకి చికిత్స కొనసాగుతుంది. అయితే, సోనియా గాంధీని సాధారణ వైద్య పరీక్షల కోసం ఆసుపత్రిలో చేర్పించినట్లు అధికారులు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ అడ్వైజర్(మీడియా) నరేష్ చౌహాన్ చెప్పిన వివరాల ప్రకారం.. స్వల్ప ఆరోగ్య సమస్యల కారణంగా సోనియా గాంధీని ఆస్పత్రికి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉంది. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
కాగా.. సోనియా సోమవారం తన కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి వ్యక్తిగత పర్యటన నిమిత్తం కొండ పట్టణానికి వచ్చారు. ప్రస్తుతం వారిద్దరూ సిమ్లా శివార్లలోని ఛరాబ్రాలోని ప్రియాంక నివాసంలో ఉంటున్నారు.