
హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో తెలుగు వారి సంప్రదాయ వంటకాలను భక్తులకు అందించేలా హోటళ్ల యజమానులు చర్యలు తీసుకోవాలని అదనపు ఈవీ వెంకయ్యచౌదరి సూచించారు.
తిరుమలలో భక్తులకు మరింత శుద్ధతతో కూడిన, సాంప్రదాయ సేవలు అందించాలన్న దృష్టితో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి.. గతంలో సిఆర్ఓ ప్రాంతంలోని హోటళ్లను తనిఖీ చేసి పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా తిరుమలలో సాంప్రదాయ వంటలను మాత్రమే భక్తులకు అందించాలని హోటల్ నిర్వహుకులకు అదనపు ఈఓ సూచించారు.
తిరుమలలో త్వరలో చైనీస్ ఫుడ్ ను పూర్తి స్థాయిలో బ్యాన్ చేస్తామని టిటిడి అదనపు ఈఓ వెంకయ్య చౌదరి తెలిపారు. దశల వారీగా చైనీస్ ఫుడ్ ను తిరుమలలో రద్దు చేస్తామని హోటల్ నిర్వహకులు స్వచ్చందంగా ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లను తనిఖీ చేశారు అదనపు ఈఓ. హోటల్ నిర్వహణలో స్పష్టమైన మార్పులు కనిపించడంతో ఆయన హర్షం వ్యక్తం చేశారు.
►ALSO READ | తిరుమల కొండపై లక్ష మందిపైనే భక్తులు : వేసవి సెలవులు ముగుస్తుండటంతో పోటెత్తిన జనం
హోటళ్ల యాజమాన్యం తమ దుకాణాలను పూర్తిగా ఆధునికీకరించి, భక్తులకు ఉత్తమమైన అనుభవాన్ని కలిగించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాయి. సాంప్రదాయ వంటకాలను భక్తులకు అందించడంతో పాటు, దుకాణ సిబ్బందిని ప్రత్యేక డ్రెస్ కోడ్లో నియమించి, వారి ప్రవర్తన కూడా మరింత మర్యాదగా ఉంచేందుకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్టేట్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు ,హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మధుసూదన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు..