
ముంబైలోని వెర్సోవా నుంచి ఓ వార్త వెలువడింది. సినీ నిర్మాత తన డ్రైవర్ పై కత్తితో దాడి చేశాడు. దీంతో నిర్మాతపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సమాచారాన్ని ముంబై పోలీసు అధికారి వెల్లడించారు. జీతం విషయంలో ఇద్దరి మధ్య వివాదం జరిగిందని.. అనంతరం నిర్మాత కత్తితో దాడి చేశాడని డ్రైవర్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ నిర్మాత పేరు మనీష్ గుప్తా. ఆయన అనేక బాలీవుడ్ చిత్రాలను రూపొందించిన స్క్రీన్ రైటర్, దర్శకుడు. సస్పెన్స్-థ్రిల్లర్ చిత్రాలను రూపొందించడంలో ప్రసిద్ధి.
READ MORE: Chhattisgarh: బీజాపూర్ నేషనల్ పార్క్లో మరో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టుల మృతి
ఈ సంఘటన గురువారం రాత్రి సాగర్ సంజోగ్ భవనంలోని మనీష్ గుప్తా ఇంట్లో జరిగిందని వెర్సోవా పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. చిత్రనిర్మాత డ్రైవర్ పేరు రాజిబుల్ ఇస్లాం లష్కర్. ఇతను మూడేళ్లుగా మనీష్తో పని చేస్తున్నాడు. రూ. 23,000 జీతం వచ్చేది. చిత్రనిర్మాత అతనికి జీతం సకాలంలో చెల్లించలేదు. మే 30న అకస్మాత్తుగా ఉద్యోగం నుంచి తొలగించాడు. జీతం ఇవ్వాలని బాధితుడు వేడుకున్నాడు. ఈ అంశంపై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన మనీష్ గుప్తా డ్రైవర్ను కత్తితో పొడిచాడు. ఈ సంఘటన తర్వాత, చిత్రనిర్మాతపై భారత శిక్షాస్మృతిలోని 118 (2), 115 (2), 352 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కానీ అతన్ని ఇంకా అరెస్టు చేయలేదు. డ్రైవర్ లష్కరే న్యాయవాది అలీ కాషిఫ్ ఖాన్ దేశ్ ముఖ్ ఆ చిత్రనిర్మాతను వీలైనంత త్వరగా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
READ MORE: Khammam: విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్ఐపై కాంగ్రెస్ నేత దాడి.!