. < 1 minute
Svs N Varma Comments On The Sand Mafia In Pithapuram

SVSN Varma : పిఠాపురంలో ఇసుక మాఫియాపై ఎస్వీఎస్ ఎన్ వర్మ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. పిఠాపురంలో గత ఐదేళ్లలో ఉన్న ఇసుక మాఫియానే మార్పులు, చేర్పుల పేరుతో ఇప్పుడు కూటమి పార్టీల్లోకి వచ్చి అదే దందాను కొనసాగిస్తోందన్నారు. వాళ్లు ఇలా చేయడం వల్ల కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని వర్మ విమర్శించారు. ఈ రోజుల్లో పరిస్థితి ఎలా ఉందంటే.. రైతు తట్టెడు మట్టి తవ్వుకుంటే నాలుగు రోజులు పోలీస్ స్టేషన్ లో ఉంటున్నాడు. కానీ ఇసుక మాఫియాను మాత్రం పోలీసులు పట్టించుకోవట్లేదు. పవన్ కల్యాణ్‌ గారు ఇప్పటికే చెప్పారు.

Read Also : Malladi Vishnu : ఐదెకరాల కోసమే శాతవాహన కాలేజీని కూల్చేశారు.. మల్లాది విష్ణు ఆరోపణలు

పిఠాపురంలో ఒకే ఒక్క చెరువుకు పర్మిషన్ ఇచ్చారు పవన్ కల్యాణ్‌. అది కూడా బట్టీలకు మాత్రమే. కానీ రోజూ 200ల లారీల్లో ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. పోలీసులు వాళ్లను ఎందుకు అరెస్ట్ చేయట్లేదు. పోలీసులు మారాలంటూ పవన్ కల్యాణ్‌ ఇప్పటికే సూచించారు. అయినా వారిలో మార్పు రావట్లేదు. వారు మాఫియాను అడ్డుకోవట్లేదు అంటే వారికి రావాల్సింది వారికి వచ్చేసినట్టే’ అని ఎస్వీఎస్ ఎన్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read Also : Janardhan Reddy : కమీషన్ల కోసమే బుగ్గన అక్రమాలు.. మంత్రి జనార్థన్ రెడ్డి ఫైర్..

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.